కెప్టెన్సీ అంటే నాకు ఇష్టం
మూడు ఫార్మాట్లలో ముగ్గురు వేర్వేరు కెప్టెన్లను చూడటం భారత క్రికెట్లో ఎప్పుడూ జరగలేదు.
By Medi Samrat
మూడు ఫార్మాట్లలో ముగ్గురు వేర్వేరు కెప్టెన్లను చూడటం భారత క్రికెట్లో ఎప్పుడూ జరగలేదు. అయితే ఇది ఇప్పుడు చూడవచ్చని అంటున్నారు. టీ20 కెప్టెన్సీ సూర్యకుమార్ చేతిలో ఉండగా, టెస్టు కెప్టెన్సీ శుభ్మన్ గిల్కు దక్కింది. రోహిత్ శర్మ ఇప్పటికీ వన్డే కెప్టెన్, కానీ అతని భవిష్యత్తుపై చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఇదిలా ఉంటే, శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీపై తన వాదనను వినిపించాడు.
అయ్యర్ కెప్టెన్సీలో పంజాబ్ కింగ్స్ ఇటీవల IPL-2025 ఫైనల్ ఆడింది. ఫైనల్లో పంజాబ్ను ఆర్సీబీ ఓడించింది. తన కెప్టెన్సీలో మూడు ఫ్రాంచైజీలను ఐపీఎల్ ఫైనల్కు తీసుకెళ్లిన ఏకైక కెప్టెన్ అయ్యర్. అందుకే అతను భారత వైట్ బాల్ కెప్టెన్సీ రేసులో చేరాడు. అయ్యర్ కెప్టెన్సీలో ఢిల్లీ క్యాపిటల్స్ 2020లో ఐపీఎల్ ఫైనల్ ఆడింది. 2024లో అతని కెప్టెన్సీలో కోల్కతా నైట్ రైడర్స్ టైటిల్ గెలుచుకుంది. ఈ సీజన్లో అతను పంజాబ్ను ఫైనల్స్కు తీసుకెళ్లాడు.
కెప్టెన్సీ అంటే తనకు ఇష్టమని అయ్యర్ చెప్పాడు. ఎందుకంటే అది ఆటగాడిలో బాధ్యతా భావాన్ని కలిగిస్తుంది. "కెప్టెన్సీ పరిపక్వత, బాధ్యతను తెస్తుంది," అని అతను చెప్పాడు. జట్టుగా ఏవైనా సమస్యలను ఎదుర్కొన్నప్పుడు, జట్టు కెప్టెన్ వద్దకు వెళుతుంది.. ఎల్లప్పుడూ సాధ్యమైనంత ఉత్తమంగా జట్టుకు సహకరించాలని కెప్టెన్ భావిస్తాడు. 22వ ఏట నుంచి కెప్టెన్గా వ్యవహరిస్తున్నందున నాకు చాలా కెప్టెన్సీ అనుభవం ఉందని భావిస్తున్నాను. నేను కెప్టెన్సీ చేసి జట్టును మెరుగైన మార్గంలో నడిపించగలిగినందుకు సంతోషంగా ఉంది. ఒత్తిడిని ఎదుర్కొవడం గురించి అయ్యర్ను అడిగినప్పుడు.. "నేను నా జోన్లో ఉండి నా ముందు ఉన్నసమస్యను పూర్తి చేయడానికి ప్రయత్నిస్తాను. నేను వీలైనంత వరకు దృష్టి కేంద్రీకరించడానికి ప్రయత్నిస్తాను. నేను పరిస్థితికి అనుగుణంగా పని చేస్తున్నాను" అని అన్నాడు.