ఆ సిరీస్‌లో ఆడతానో లేదో నేను ఎలా చెప్పగలను.? : షకీబ్

బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో 2 టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ఆడుతోంది. సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ ఓటమి చవిచూడాల్సి వచ్చింది

By Medi Samrat  Published on  28 Oct 2024 3:00 PM GMT
ఆ సిరీస్‌లో ఆడతానో లేదో నేను ఎలా చెప్పగలను.? : షకీబ్

బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో 2 టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ఆడుతోంది. సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. రెండో మ్యాచ్ అక్టోబర్ 29 నుంచి జరగనుంది. ఈ సిరీస్ తర్వాత బంగ్లాదేశ్ అఫ్గానిస్థాన్‌తో మూడు వన్డేల సిరీస్ ఆడాల్సి ఉంది. అయితే ఈ సిరీస్‌కు షకీబ్ అల్ హసన్ ఆడటంపై అనుమానాలు ఉన్నాయి. ఈ సిరీస్ కోసం బోర్డు తనను ఇంకా సంప్రదించలేదని చెప్పాడు.

తన చివరి టెస్టు సిరీస్‌గా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో ఆడాలని షకీబ్ తన కోరికను వ్యక్తం చేశాడు. కానీ బోర్డు అతనికి అవకాశం ఇవ్వలేదు. ఇప్పుడు ఆఫ్ఘనిస్థాన్‌తో వన్డే సిరీస్‌లో షకీబ్ అల్ హసన్‌కు అవకాశం దక్కే ఛాన్స్‌ లేదు. తదుపరి చర్య గురించి బోర్డు ఇంకా అతనికి తెలియజేయలేదు. నేను ఆఫ్ఘనిస్తాన్‌తో వన్డే ఆడతానో లేదో నేను ఎలా చెప్పగలను.. దాని గురించి బీసీబీ చెప్పాలని షకీబ్ సోమవారం క్రిక్‌బజ్‌తో అన్నారు.

2024 టీ20 ప్రపంచకప్ తర్వాత షకీబ్ టీ20 ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత వన్డే ఫార్మాట్‌కు రిటైర్మెంట్ కూడా ప్రకటించనున్నాడు. అయితే.. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు వన్డే సిరీస్ ఆడటంపై షకీబ్ అనుమానంగానే ఉన్నాడు. భారత్‌తో 2 టెస్టుల సిరీస్‌లో అశాంతి సందర్భంగా షకీబ్ హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడు. అయితే.. నేరం రుజువయ్యే వరకూ ఆడేందుకు బోర్డు అనుమతించింది.

బంగ్లాదేశ్‌లో కొన్ని నెలల క్రితం తిరుగుబాటు జరిగింది. ఆ సమయంలో షకీబ్‌పై అశాంతి, హత్య ఆరోపణలు వచ్చాయి. అయితే.. ఈ సమయంలో షకీబ్ వేరే దేశంలో లీగ్ ఆడుతున్నాడు. నవంబర్ 6న ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్‌లతో సిరీస్‌లు ప్రారంభం కానున్నాయి. రెండో మ్యాచ్ నవంబర్ 9న, చివరి మ్యాచ్ నవంబర్ 11న జరగనుంది. ఈ మ్యాచ్‌లన్నీ షార్జాలో జరగనున్నాయి.

Next Story