ప్రధాని మోదీ మాట్లాడినా.. ఫోగట్ విషయంలో ఫలితం లేదాయె.!

పారిస్ ఒలింపిక్ గోల్డ్ మెడల్ బౌట్ నుండి రెజ్లర్ వినేష్ ఫోగట్ అనర్హతపై సమాచారాన్ని పొందడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ IOA అధ్యక్షురాలు PT ఉషను వ్యక్తిగతంగా సంప్రదించారు

By Medi Samrat  Published on  7 Aug 2024 9:15 AM GMT
ప్రధాని మోదీ మాట్లాడినా.. ఫోగట్ విషయంలో ఫలితం లేదాయె.!

పారిస్ ఒలింపిక్ గోల్డ్ మెడల్ బౌట్ నుండి రెజ్లర్ వినేష్ ఫోగట్ అనర్హతపై సమాచారాన్ని పొందడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ IOA అధ్యక్షురాలు PT ఉషను వ్యక్తిగతంగా సంప్రదించారు. ఫోగట్ కేసుకు మద్దతు ఇవ్వడానికి సాధ్యమయ్యే అన్ని మార్గాలను అన్వేషించాలని ఉషను ప్రధాని మోదీ అభ్యర్థించారు. ఆమెకి ప్రయోజనం చేకూర్చేలా ఆమె అనర్హతపై బలమైన నిరసనను వ్యక్తం చేయాలని సూచించారు.

వినేష్ ఫోగట్‌పై అనర్హత వేటు పడటంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ప్రధాని మోదీ ‘వినేశ్‌.. నువ్వు ఛాంపియన్లకే ఛాంపియన్‌! నీ ప్రతిభ దేశానికి గర్వకారణం. భారతీయులందరికీ నువ్వు స్ఫూర్తిదాయకం. ఈ రోజు నీకు తగిలిన ఎదురుదెబ్బ ఎంతో బాధించింది. దీన్ని వ్యక్తం చేయడానికి నా దగ్గర మాటల్లేవు. కానీ, ఈ బాధ నుంచి బయటపడి నువ్వు బలంగా తిరిగి రాగలవని నేను నమ్ముతున్నా. సవాళ్లను ఎదిరించడం నీ నైజం. నీకు మేమంతా అండగా ఉన్నాం’ అని ప్రధాని నరేంద్ర మోదీ భరోసా ఇచ్చారు. 50 కిలోల విభాగంలో బుధవారం రాత్రి ఫైనల్‌లో వినేశ్‌ ఫొగట్‌ రెజ్లింగ్‌లో పాల్గొనాల్సి ఉంది. అయితే.. ఆమె 100 గ్రాములు ఎక్కువగా ఉండటం వల్ల ఆమెపై అనర్హత వేటు వేస్తున్నట్లు ఒలింపిక్ కమిటీ, రెజ్లింగ్ కమిటీ నిర్ణయం తీసుకుంది.

Next Story