మెగా టోర్నీలో బోణీ కొట్టిన పాక్‌

Pakistan won by 6 wkts against Netherlands. ఆదివారం పెర్త్‌లో నెదర్లాండ్స్‌పై ఆరు వికెట్ల తేడాతో నెదర్లాండ్స్‌ను ఓడించిన పాకిస్థాన్ టీ20 ప్రపంచకప్‌లో

By Medi Samrat  Published on  30 Oct 2022 2:15 PM GMT
మెగా టోర్నీలో బోణీ కొట్టిన పాక్‌

ఆదివారం పెర్త్‌లో నెదర్లాండ్స్‌పై ఆరు వికెట్ల తేడాతో నెదర్లాండ్స్‌ను ఓడించిన పాకిస్థాన్ టీ20 ప్రపంచకప్‌లో పాయింట్లను దక్కించుకుంది. పాకిస్థాన్ జట్టుకు తప్పక గెలవాల్సిన గేమ్‌లో షాదాబ్ ఖాన్ మూడు వికెట్లతో రాణించాడు. ఈ మ్యాచ్ లో పాక్ నెదర్లాండ్స్ పై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. పెర్త్ లో నెదర్లాండ్స్ నిర్దేశించిన 92 పరుగుల విజయలక్ష్యాన్ని పాక్ కేవలం 13.5 ఓవర్లలోనే ఛేదించింది. ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ ఛేదనలో కీలకపాత్ర పోషించాడు. కెప్టెన్ బాబర్ అజామ్ 4 పరుగులకే అవుట్ అవ్వగా.. రిజ్వాన్ 39 బంతుల్లోనే 49 పరుగులు చేసి ఇన్నింగ్స్ నిలబెట్టాడు. ఫఖార్ జమాన్ 20, షాన్ మసూద్ 12 పరుగులు చేశారు. నెదర్లాండ్స్ బౌలర్లలో బ్రాండన్ గ్లోవర్ 2, పాల్ వాన్ మీకెరెన్ 1 వికెట్ తీశారు. ఇది పాకిస్థాన్ కు ఆస్ట్రేలియా గడ్డపై తొలి విజయం. పాకిస్థాన్ ను బాబర్ ఆజమ్ ఫామ్ వెంటాడుతూ ఉంది.. పసికూనలపై కూడా రాణించలేకపోయాడు. ఈ ప్రపంచ కప్‌లో ఇప్పటి వరకూ ఒక్క మ్యాచ్ లో కూడా రెండంకెల స్కోర్ చేయలేకపోయాడు.


Next Story