అప్పుడే భారత్‌తో ఆడే టీమ్‌ను ప్రకటించిన ఇంగ్లండ్

భారత్‌తో జరగనున్న టెస్ట్ సిరీస్‌లోని మొదటి మ్యాచ్ కోసం ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డ్ (ఈసీబీ) జట్టును ప్రకటించింది.

By Medi Samrat
Published on : 5 Jun 2025 7:15 PM IST

అప్పుడే భారత్‌తో ఆడే టీమ్‌ను ప్రకటించిన ఇంగ్లండ్

భారత్‌తో జరగనున్న టెస్ట్ సిరీస్‌లోని మొదటి మ్యాచ్ కోసం ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డ్ (ఈసీబీ) జట్టును ప్రకటించింది. 14 మంది సభ్యుల ఇంగ్లండ్ టెస్టు జట్టుకు ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. 2025-27 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ సైకిల్‌లో భాగంగా భారత జట్టు ఇంగ్లండ్‌లో పర్యటిస్తోంది. ఈ పర్యటనలో భారత టెస్ట్ జట్టుకు శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా, రిషభ్ పంత్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు.

జూన్ 20 నుంచి లీడ్స్‌లోని హెడింగ్లీ మైదానంలో భారత్, ఇంగ్లండ్ మధ్య ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ జరగనుంది. ఇంగ్లండ్ జట్టులో జో రూట్, జాక్ క్రాలీ, ఓలీ పోప్ వంటి అనుభవజ్ఞులైన ఆటగాళ్లు ఉన్నారు. యువ ప్రతిభావంతులైన షోయబ్ బషీర్, జాకబ్ బెథెల్, జేమీ స్మిత్‌లకు కూడా చోటు కల్పించారు.

ఇంగ్లండ్ జట్టు:

బెన్ స్టోక్స్ (కెప్టెన్) షోయబ్ బషీర్, జాకబ్ బెథెల్, హ్యారీ బ్రూక్, బ్రైడన్ కార్స్, సామ్ కుక్, జాక్ క్రాలీ, బెన్ డకెట్, జేమీ ఓవర్టన్, ఓలీ పోప్, జో రూట్, జేమీ స్మిత్, జోష్ టంగ్, క్రిస్ వోక్స్

Next Story