రూ.100కోట్ల పరువు నష్టం కేసు.. స్టేట్‌మెంట్ ఇవ్వ‌నున్న ధోనీ..!

ఐపీఎల్ బెట్టింగ్ కుంభకోణంలో తన పేరును లాగినందుకు రెండు పెద్ద మీడియా ఛానెల్‌లు మరియు ఒక జర్నలిస్ట్‌పై దాఖలైన రూ.100 కోట్ల పరువు నష్టం కేసులో భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఇప్పుడు తన వాంగ్మూలాన్ని నమోదు చేయనున్నారు.

By Medi Samrat
Published on : 12 Aug 2025 2:47 PM IST

రూ.100కోట్ల పరువు నష్టం కేసు.. స్టేట్‌మెంట్ ఇవ్వ‌నున్న ధోనీ..!

ఐపీఎల్ బెట్టింగ్ కుంభకోణంలో తన పేరును లాగినందుకు రెండు పెద్ద మీడియా ఛానెల్‌లు మరియు ఒక జర్నలిస్ట్‌పై దాఖలైన రూ.100 కోట్ల పరువు నష్టం కేసులో భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఇప్పుడు తన వాంగ్మూలాన్ని నమోదు చేయనున్నారు. 100 కోట్ల పరువు నష్టం కేసులో మద్రాసు హైకోర్టు విచారణకు ఆదేశించింది. 11 ఏళ్ల తర్వాత హైకోర్టు ఈ ఉత్తర్వులు జారీ చేసింది.

2013 ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ స్కామ్.. ఐపీఎల్‌ లీగ్ చరిత్రలో అతిపెద్ద కుంభకోణంగా పరిగణించబడుతుంది. ఇందులో శ్రీశాంత్‌, అజిత్‌ చండీలా, అంకిత్‌ చవాన్‌ వంటి ముగ్గురు క్రికెటర్లను దోషులుగా గుర్తించారు. అదే సమయంలో ఈ కేసులో చెన్నై సూపర్ కింగ్స్ యజమాని ఎన్ శ్రీనివాసన్ అల్లుడు, జట్టు ప్రిన్సిపాల్ గురునాథ్ మెయ్యప్పన్ పేరు కూడా వచ్చింది. రెండు ఫ్రాంచైజీలు.. చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ బెట్టింగ్ కార్యకలాపాల కారణంగా రెండేళ్లపాటు నిషేధించబడ్డాయి.

భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ 2014 సంవత్సరంలో పరువు నష్టం కేసును దాఖలు చేయ‌గా.. అందులో ఆయ‌న ప్రతివాదుల నుండి రూ. 100 కోట్ల నష్టపరిహారం కోరాడు. టీవీ డిబేట్‌లో తనపై పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు.

11 ఏళ్ల తర్వాత మద్రాసు హైకోర్టు ఈ కేసుపై చర్య తీసుకుంది. జస్టిస్ సివి కార్తికేయన్ ఒక అడ్వకేట్ కమిషనర్‌ని నియమించగా.. ఆయన ధోని (ఎంఎస్ ధోని) తరపున సాక్ష్యాలను నమోదు చేస్తారు. ధోనీ కోర్టుకు హాజ‌రుకాలేడు.. అతని రాకతో రద్దీ పరిస్థితి నెల‌కొనే అవ‌కాశం ఉంది.

ది హిందూ నివేదిక ప్రకారం.. ధోనీ తరపున సీనియర్ న్యాయవాది పి.ఆర్. రామన్ అఫిడవిట్ సమర్పించారు, అందులో దశాబ్ద కాలంగా పెండింగ్‌లో ఉన్న విచారణను ప్రారంభించాలని డిమాండ్ చేశారు. కేసును పరిష్కరించడంలో ఎలాంటి జాప్యం జరగకుండా.. న్యాయమైన మరియు త్వరితగతిన విచారణ జరగాలనే ఉద్దేశ్యంతో ఈ అభ్యర్థన చేయబడింది. నేను అడ్వకేట్ కమీషనర్‌కు పూర్తిగా సహకరిస్తాను. ఈ గౌరవనీయమైన కోర్టు జారీ చేసిన అన్ని ఆదేశాలను పాటిస్తాను అని అఫిడ‌విట్‌లో పేర్కొన్నారు. ధోని ఆగస్ట్ 2020లో అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్ అయ్యాడు. అయితే అతడు IPLలో CSK తరపున ఆడుతున్నాడు.

Next Story