కొత్త వ్యాపారంలోకి ఎంఎస్ ధోనీ.. అది చాలా లాభ‌సాటి గురూ..!

MS Dhoni Enters New Business. టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ కొత్త వ్యాపారాన్నిమొద‌లుపెట్ట‌నున్న‌ట్లు తెలుస్తోంది.

By Medi Samrat  Published on  15 Nov 2020 3:58 AM GMT
కొత్త వ్యాపారంలోకి ఎంఎస్ ధోనీ.. అది చాలా లాభ‌సాటి గురూ..!

టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ కొత్త వ్యాపారాన్నిమొద‌లుపెట్ట‌నున్న‌ట్లు తెలుస్తోంది. అత్యధిక పోషక విలువలు కలిగి ఉండే నల్లకోళ్లు 'కడక్‌నాథ్‌' పెంపకంపై దృష్టి సారించినట్లు స‌మాచారం. రాంచీలోని ధోనీ ఫాంహౌజ్ లో ఈ ఆర్గానిక్‌ పౌల్ట్రీ పరిశ్రమను నెలకొల్పనున్నాడ‌ని వార్త‌లు వెలువ‌డుతున్నాయి. ఈ మేరకు ధోనీ ముందుగానే 2 వేల కోడి పిల్లలు ఆర్డ‌ర్ చేసిన‌ట్లు .. అవి కూడా డిసెంబరు 15వ తేదీ నాటికి డెలివరీ కానున్నయ‌ట‌. ఈ మేరకు మధ్యప్రదేశ్‌ గిరిజన రైతు వినోద్‌ మెండాతో కూడా ఒప్పందం కుదుర్చుకున్నారట‌.

ఈ విషయమై మ‌ధ్యప్రదేశ్‌లోని జబువాలో గల కడక్‌నాథ్‌ ముర్గా రీసెర్చ్‌ సెంటర్‌ డైరెక్టర్‌ ఐఎస్‌ తోమర్‌ మీడియాతో మాట్లాడుతూ.. కోళ్ల పెంపకం విషయమై ధోనీ తమను సంప్రదించాడని.. అయితే ఆ సమయంలో తమ వద్ద కోడి పిల్లలు అందుబాటులో లేనందున రైతు నంబరు ఆయనకు ఇచ్చినట్లు పేర్కొన్నారు.

ఇదిలావుంటే.. మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని ఝూబువా, అలీరాజ్‌పూర్‌ పరిసరాల్లో భీల్, భిలాలా తెగ ప్రజలు వందల ఏళ్ల నుంచి ఈ జాతి కోళ్లను పెంచుతున్నారు. ఈ కోళ్ల‌లో ప్రొటీన్ల శాతం ఎక్కువ కాగా.. కొలెస్ట్రాల్‌ శాతం చాలా తక్కువ. ఇక ఈ జాతి కోడి కిలో మాంసం రూ.700 నుంచి రూ.వెయ్యి వ‌ర‌కు ఉంటుంద‌ట‌.. దీని గుడ్డు ధర రూ.40–50 పైగానే ప‌లుకుతుంద‌ట‌.


Next Story