ఐపీఎల్‌-2024లో DRS స్థానంలో SRS వ‌స్తుందా..?

ఐపీఎల్ 2024 ప్రారంభానికి ముందు నిబంధనలలో పెద్ద మార్పు రాబోతోంది. ఐపీఎల్ 2024లో నిర్ణయ సమీక్ష వ్యవస్థను రద్దు చేయనున్నట్టు చెబుతున్నారు.

By Medi Samrat  Published on  19 March 2024 1:54 PM GMT
ఐపీఎల్‌-2024లో DRS స్థానంలో SRS వ‌స్తుందా..?

ఐపీఎల్ 2024 ప్రారంభానికి ముందు నిబంధనలలో పెద్ద మార్పు రాబోతోంది. ఐపీఎల్ 2024లో నిర్ణయ సమీక్ష వ్యవస్థను రద్దు చేయనున్నట్టు చెబుతున్నారు. దీని స్థానంలో నిర్ణయం తీసుకోవడానికి కొత్త వ్యవస్థను ప్రవేశపెట్టనున్నారు. ఈ కొత్త సిస్టమ్ పేరు స్మార్ట్ రివ్యూ సిస్టమ్. ఇది DRS అప్‌డేటెడ్ వెర్ష‌న్ కావ‌డం విశేషం. అంపైర్ సరైన నిర్ణయం తీసుకోవడంలో ఈ వ్యవస్థను ప్రవేశపెట్టడం ఎంతగానో దోహదపడుతుంది. IPL 2024లో DRSని SRSగా మార్చనున్నట్లు ESPN నివేదికలో పేర్కొన్నారు. ఈ వ్యవస్థను ఎందుకు తీసుకురావాలి.. ఈ వ్యవస్థ ఎలా పని చేస్తుందో అర్థం చేసుకుందాం.

డీఆర్‌ఎస్‌లో సాధ్యంకాని స్మార్ట్ రివ్యూ సిస్టమ్ ద్వారా మరింత కచ్చితమైన నిర్ణయాలు తీసుకోవచ్చని నివేదికలో పేర్కొంటున్నారు. ఇందుకోసం స్మార్ట్ రీప్లే సిస్టమ్‌ను సిద్ధం చేయనున్నారు. ఈ కొత్త విధానంతో నిర్ణయంలో పెద్దగా జాప్యం ఉండదు. ఈ వ్యవస్థను ప్రవేశపెట్టిన తర్వాత ఏదైనా ఒక సంఘటన అనేక కోణాల్లో చూపబడుతుంది. ఇది కాకుండా.. అనేక విభజించబడిన స్క్రీన్లు కూడా ఇందులో చూపబడతాయి. స్మార్ట్ రీప్లే సిస్టమ్ కింద.. హాక్-ఐ ఆపరేటర్ల నుండి టీవీ అంపైర్ నేరుగా ఇన్‌పుట్‌లను స్వీకరించగలరు. దీనికి మధ్యవర్తి ఎవరూ ఉండరు. ఇందుకోసం ప్రత్యేకంగా స్మార్ట్ రివ్యూ సిస్టమ్‌లో పనిచేసే 8 కెమెరాలను మొత్తం స్టేడియంలో ప్రత్యేకంగా అమర్చనున్నారు.

మునుపటి నిర్ణయ సమీక్ష వ్యవస్థలో టీవీ డైరెక్టర్ థర్డ్ అంపైర్, హాక్-ఐ ఆపరేటర్ మధ్య కమ్యూనికేషన్‌గా వ్యవహరించారు. కానీ స్మార్ట్ రివ్యూ సిస్టమ్‌లో ఇది జరగదు. ఇందులో టీవీ డైరెక్టర్‌కి పని ఉండదు. స్మార్ట్ రివ్యూ సిస్టమ్‌ను దృష్టిలో ఉంచుకుని.. బీసీసీఐ భారతదేశం, విదేశాల నుండి మొత్తం 15 మంది అంపైర్‌లతో 2 రోజుల వర్క్‌షాప్‌ను నిర్వహించిందని నివేదికలో పేర్కొన్నారు. దీనికి సంబంధించి బీసీసీఐ నుండి ఇంకా అధికారిక సమాచారం రాలేదు, అయితే ఐపీఎల్ 2024 ప్రారంభానికి ముందే బీసీసీఐ దీనిని ప్రకటిస్తుందని భావిస్తున్నారు. ఇది జరిగితే నిర్ణయాలు మరింత ఖచ్చితంగా తీసుకోవచ్చు.

Next Story