ఇంగ్లాండ్తో జరగనున్న ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్కు ముందు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ తిరిగి జట్టుతో చేరాడు. జూన్ 20 నుండి ప్రారంభమయ్యే సిరీస్ ప్రారంభ మ్యాచ్కు సిద్ధమవుతున్న గంభీర్ జూన్ 18న హెడింగ్లీకి తిరిగి వచ్చాడు. తన కోచింగ్ సిబ్బందితో కలిసి జట్టు శిక్షణా సెషన్లను పర్యవేక్షించాడు.
గుండెపోటుతో ఆసుపత్రి పాలైన తన తల్లిని చూడడం కోసం గంభీర్ జూన్ 11న భారతదేశానికి తిరిగి వచ్చాడు. బెకెన్హామ్లో జరిగిన భారత జట్టు మూడు రోజుల సన్నాహక మ్యాచ్కు దూరమయ్యాడు. ఇందులో సీనియర్ టెస్ట్ జట్టు, ఇండియా A బృందం రెండూ పాల్గొన్నాయి. ఆ తర్వాత గంభీర్ తల్లి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడింది. మొదటి టెస్ట్కు కేవలం రెండు రోజుల ముందు కోచ్ జట్టుతో తిరిగి కలిశాడు.