అండర్-19 ఆసియా కప్లో భారత్ ఘోర పరాజయం
అండర్-19 ఆసియా కప్ ఫైనల్లో భారత కుర్రాళ్లకు ఊహించని షాక్ తగిలింది
By - Knakam Karthik |
అండర్-19 ఆసియా కప్లో భారత్ ఘోర పరాజయం
అండర్-19 ఆసియా కప్ ఫైనల్లో భారత కుర్రాళ్లకు ఊహించని షాక్ తగిలింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో ఆదివారం జరిగిన ఫైనల్లో భారత్ 191 పరుగుల తేడాతో ఘోర పరాజయం చవిచూసింది. అన్ని రంగాల్లో ఆధిపత్యం కనబర్చిన పాక్ జట్టు టైటిల్ను కైవసం చేసుకుంది.
దుబాయ్లోని ఐసీసీ అకాడమీ స్టేడియంలో జరిగి ఈ మ్యాచ్ లో భారత్ మొదట టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్కు దిగిన పాక్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 347 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. ఓపెనర్ సమీర్ మిన్హాస్ 172 పరుగులతో అద్భుత సెంచరీ చేశాడు. భారత బౌలర్లలో దీపేశ్ దేవేంద్రన్ 3, హెనిల్ పటేల్ 2, ఖిలాన్ పటేల్ 2, కాన్షిక్ చౌహాన్ ఒక వికెట్ పడగొట్టారు.
అనంతరం 348 పరుగుల టార్గెట్లో భారత్ దారుణంగా విఫలమైంది. స్టార్ బ్యాటర్లు ఎవరూ ఆకట్టుకోలేకపోయారు. దాంతో 26.2 ఓవర్లలో 156 పరుగులకే ఆలౌటైంది. భారత ఇన్నింగ్స్లో బౌలర్ దీపేశ్ దేవేంద్రన్ 36 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. వైభవ్ సూర్య వంశీ 26, కెప్టెన్ ఆయుష్ మాత్రే 2, ఆరోన్ జార్జ్ 16, విహాన్ మల్హోత్రా 7, వేదాంత్ త్రివేది 9, అభిజ్ఞాన్ కుందు 13, కనిష్క్ చౌహాన్ 9, ఖిలన్ పటేల్ 19, హెనిల్ పటేల్ 6, కిషన్ సింగ్ 3 పరుగులు చేశారు. పాక్ బౌలర్లలో అలీ రెజా 4 వికెట్లతో భారత్ ను దెబ్బతీశాడు. మహ్మద్ సయ్యాం 2, అబ్దుల్ సుభాన్ 2, హుజైపా అహ్సాన్ 2 వికెట్లు తీశారు.