పాకిస్థాన్ మంచి క్రికెట్ ఆడటం లేదు.. అందుకే పట్టించుకోం..!
పాకిస్థాన్ మంచి క్రికెట్ ఆడటం లేదని భారత వికెట్ కీపర్-బ్యాట్స్మెన్ జితేష్ శర్మ అన్నారు.
By - Medi Samrat |
పాకిస్థాన్ మంచి క్రికెట్ ఆడటం లేదని భారత వికెట్ కీపర్-బ్యాట్స్మెన్ జితేష్ శర్మ అన్నారు. దీని కారణంగానే టీమ్ ఇండియా వారికి ప్రాధాన్యత ఇవ్వడం మానేసిందని ఆయన పేర్కొన్నారు. జితేష్ వ్యాఖ్యలు క్రికెట్ ప్రపంచంలో కలకలం సృష్టించగా.. అతడు పాకిస్థాన్ను తీవ్రంగా ట్రోల్ చేశాడు. అంతకుముందు.. పాకిస్థాన్తో వైరం ముగిసిపోయిందని భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా అన్నారు.
కొంతకాలంగా పాకిస్థాన్ భారత్కు గట్టి పోటీ ఇవ్వలేకపోతోంది. 2025 ఆసియా కప్లో భారత్ మూడు మ్యాచ్లు గెలిచింది. దీని తర్వాత.. టీమ్ ఇండియా 2026 టీ20 ప్రపంచ కప్ను గెలుచుకుంది. ఇది జితేష్ను పాకిస్థాన్ను ఎగతాళి చేసేలా ప్రేరేపించింది.
పాకిస్థాన్తో ఆడేటప్పుడు భారత ఆటగాళ్లు భావోద్వేగానికి గురవుతారా అని జితేష్ను అడిగారు. రణ్వీర్ అల్లాహాబాడియాతో ఒక పాడ్కాస్ట్లో మాట్లాడుతూ జితేష్ ఇలా అన్నారు.. "లేదు.. అది కేవలం నియంత్రణకు సంబంధించిన విషయం. మేము వాటికి అంత ప్రాముఖ్యత ఇవ్వము. మేము దాని గురించి అంతగా ఆలోచించము.. మనసు పెట్టము. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా సవాలు విసిరే జట్లే, కానీ పాకిస్థాన్ మంచి క్రికెట్ ఆడటం లేదు. మేము భావోద్వేగాలతో క్రికెట్ ఆడము. అలా ఆడితే మ్యాచ్ ఓడిపోవచ్చు. అందుకే మేము ముందు మ్యాచ్ గెలిచి, ఆ తర్వాతే మా భావోద్వేగాలను వ్యక్తపరుస్తాము"
2025 ఆసియా కప్ సందర్భంగా పాకిస్తానీ స్పిన్నర్ సంజు సామ్సన్ను అవుట్ చేసిన తర్వాత పాక్ బౌలర్ సంజ్ఞ చేశాడు. సంజు అవుటైనట్లుగా అహ్మద్ తల అడ్డంగా ఊపి సంకేతం ఇచ్చాడు. ఆ తర్వాత భారత జట్టు మ్యాచ్ గెలిచాక జితేష్ శర్మ, హర్షిత్ రాణా, అర్ష్దీప్ సింగ్ అబ్రార్ని అనుకరించారు. దీనికి సంబంధించిన ఒక వీడియో కూడా బయటపడింది.
ఈ విషయం గురించి మాట్లాడుతూ.. వికెట్ కీపర్-బ్యాట్స్మన్ జితేష్ శర్మ ఇలా అన్నాడు, "అతను సంజు భాయ్ని అవుట్ చేసేటప్పుడు అలా చేశాడు. మాకు ఆ విషయం నచ్చలేదు. అందుకే మేము అతన్ని అనుకరించాము."