పాక్‌తో మ్యాచ్‌లో దూకుడు తగ్గించేది లేదు

ఆసియాకప్‌లో పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లో తమ జట్టు దూకుడు తగ్గించేది లేదని భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మంగళవారం స్పష్టం చేశాడు.

By -  Medi Samrat
Published on : 9 Sept 2025 10:28 PM IST

పాక్‌తో మ్యాచ్‌లో దూకుడు తగ్గించేది లేదు

ఆసియాకప్‌లో పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లో తమ జట్టు దూకుడు తగ్గించేది లేదని భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మంగళవారం స్పష్టం చేశాడు. సెప్టెంబర్ 14న దుబాయ్‌లో జరిగే ఈ బహుళ జాతీయ టోర్నీలో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో భారత్ తలపడనుంది. దీనికి ముందు భారత్ బుధవారం యుఏఈతో మొద‌టి మ్యాచ్ ఆడ‌నుంది.

నేటి నుంచి ఆసియాకప్‌ ప్రారంభం కానుందని, దీనికి ముందు విలేకరుల సమావేశంలో సూర్యకుమార్‌ మాట్లాడుతూ.. అంతర్జాతీయ స్థాయిలో ఆడాలంటే మైదానంలో దూకుడు ప్రదర్శించాలన్నారు. అయితే దీనిపై పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ మాట్లాడుతూ.. భిన్నాభిప్రాయాలు ఉంటాయ‌ని.. జట్టు సభ్యులకు తన వైపు నుంచి అలాంటి సందేశం రాదని అంటున్నారు. దూకుడుతో మైదానంలోకి దిగేందుకు నేను ఉత్సాహంగా ఉన్నాను. ఎవరైనా దూకుడుగా ఉండాలనుకుంటే అది అతని నిర్ణయం. నా టీమ్ విషయానికొస్తే.. నేను ఎవరికీ డైరెక్షన్ ఇవ్వను అని పేర్కొన్నాడు.

ఈ ఏడాది ఏప్రిల్‌లో పహల్గామ్‌లో ఉగ్రవాదుల దాడి జరిగింది. ఇందులో 26 మంది పర్యాటకులు మరణించారు. ఆ తర్వాత భారత్ దానికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ పేరుతో సైనిక చర్యను ప్రారంభించింది. ఆసియా కప్ విలేకరుల సమావేశంలో కూడా సూర్యకుమార్, సల్మాన్ పక్కప‌క్క‌న కూర్చోలేదు.

మంచి ప్రాక్టీస్ సెషన్ తర్వాత తమ జట్టు మంచి ఫామ్‌లో ఉందని సూర్యకుమార్ చెప్పాడు. మేము కొన్ని మంచి ప్రాక్టీస్ సెషన్లలో పాల్గొన్నాం. నేను ఇష్టపడుతున్నాను. ఆసియా కప్‌లో అత్యుత్తమ జట్లతో ఆడడం మంచి సవాలు. భారత మాజీ ఆటగాడు లాల్‌చంద్ రాజ్‌పుత్ యూఏఈ జట్టుకు కోచ్‌గా ఉన్నాడని.. ఆతిథ్య జట్టును తేలికగా తీసుకోనని భారత కెప్టెన్ చెప్పాడు.

'అద్భుతమైన క్రికెట్‌ ఆడుతున్నారు, ఇటీవలి ముక్కోణపు సిరీస్‌లో కొన్ని మ్యాచ్‌లు ఆడారు. ఆసియా కప్‌లో రాణిస్తారని ఆశిస్తున్నా. తొలి మ్యాచ్‌లో భారత జట్టు ఏదైనా ప్రయోగం చేస్తుందా? దీనిపై సూర్యకుమార్ మాట్లాడుతూ.. కారణం లేకుండా ప్రయోగాలు చేయాల్సిన అవసరం ఏమిటి? మేము మంచి ఫలితాలను పొందుతున్నాం.. ఎందుకు మార్పులు చేస్తాము? అని ప్ర‌శ్నించాడు.

Next Story