పాక్‌ విమానాలకు భారత గగనతల నిషేధం.. మరో నెల రోజులు పొడిగింపు

గత నెలలో జరిగిన పహల్గామ్ ఉగ్రవాద దాడిలో 26 మంది పౌరులు మరణించిన భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి.

By Medi Samrat
Published on : 23 May 2025 9:21 PM IST

పాక్‌ విమానాలకు భారత గగనతల నిషేధం.. మరో నెల రోజులు పొడిగింపు

గత నెలలో జరిగిన పహల్గామ్ ఉగ్రవాద దాడిలో 26 మంది పౌరులు మరణించిన భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో, పాకిస్తాన్ విమానాలపై గగనతల నిషేధాన్ని జూన్ 23 వరకు భారతప్రభుత్వం పొడిగించింది. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ శుక్రవారం జారీ చేసిన సూచనల మేరకు భారత NOTAM (ఎయిర్‌మెన్/ఎయిర్ మిషన్లకు నోటీసు) జారీ చేసింది. ఈ చర్య ప్రకారం, సైనిక విమానాలు సహా పాకిస్తాన్ విమానయాన సంస్థలు లీజుకు తీసుకున్న, యాజమాన్యంలోని విమానాలు భారత గగనతలంలోకి ప్రవేశించకుండా నిషేధించనున్నారు.

పాకిస్తాన్ భారత విమానాలకు తన గగనతల మూసివేతను మరో నెల రోజులు పొడిగించిందని మీడియా నివేదికలు రాగా, భారత్ ఈ నిర్ణయం తీసుకుంది. లష్కరే తోయిబాతో అనుబంధంగా ఉన్న ఉగ్రవాదులు చేసిన దారుణమైన దాడి తర్వాత, ఏప్రిల్ 23న పాకిస్తాన్ మొదట భారత విమానాలకు తన గగనతలాన్ని మూసివేసింది. అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ (ICAO) గగనతల ఆంక్షలను ఒకేసారి ఒక నెల కంటే ఎక్కువ కాలం విధించరాదని నిబంధనలు ఉండడంతో ఒక నెల మాత్రమే నిషేధం విధించింది. పాక్ చర్యలకు భారత్ కూడా ప్రతీకారం తీర్చుకుంది.

Next Story