ఇళయ దళపతిని కలిసిన మహేంద్ర సింగ్ ధోని

Dhoni Meet With Vijay. భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఇళయదళపతి

By Medi Samrat  Published on  12 Aug 2021 2:09 PM GMT
ఇళయ దళపతిని కలిసిన మహేంద్ర సింగ్ ధోని

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఇళయదళపతి విజయ్ ను కలిశారు. ఇటీవల వీరిద్దరి భేటీ జరిగింది. అందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి. విజయ్ ప్రస్తుతం నెల్సన్ కుమార్ దర్శకత్వంలో 'బీస్ట్' చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చెన్నైలోని గోకుల్ స్టూడియోస్ లో జరుగుతోంది. షూటింగ్ స్పాట్ కు వెళ్లిన ధోనీకి విజయ్ సాదరంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఇరువురు అనేక అంశాలపై మాట్లాడుకున్నారు.

విజయ్ తన బీస్ట్ చిత్రం షూటింగ్‌లో భాగంగా స్టూడియో లో ఉండగా, ధోనీ గత కొన్ని రోజులుగా టెలివిజన్ వాణిజ్య ప్రకటనల కోసం షూటింగ్ చేస్తున్నారు. ఇద్దరు స్టార్లు ఒకే స్టూడియోలో ఉన్నారని తెలిసినప్పుడు, వారు ఒకరినొకరు కలవాలని నిర్ణయించుకున్నారు. 2008 లో ఐపిఎల్ ప్రారంభ సీజన్ కోసం విజయ్ చెన్నై సూపర్ కింగ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రకటించబడ్డారు. చెన్నైలో దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ బీస్ట్ ను తెరకెక్కిస్తూ ఉన్నారు. రెండవ షెడ్యూల్‌లో విజయ్, పూజా హెగ్డే పాల్గొన్నారు.

మహేంద్ర సింగ్ ధోనీ కొద్ది రోజుల క్రితం చెన్నై చేరుకున్నారు మరియు ఐపిఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్) 2021 కి ముందు వాణిజ్య ప్రకటనల కోసం షూటింగ్ చేస్తున్నారు. విజయ్, ధోని ఇద్దరూ గోకులం స్టూడియోస్‌లో షూటింగ్ చేస్తున్న సమయంలో కలుసుకున్నారు. 2008 లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టును ఆవిష్కరించిన తర్వాత తొలిసారి ఇద్దరూ కలుసుకుని ఉన్నారని అభిమానులు చర్చించుకుంటూ ఉన్నారు. అప్పట్లో చెన్నై సూపర్ కింగ్స్ కు విజయ్, నయనతారలను జట్టు బ్రాండ్ అంబాసిడర్‌లుగా ప్రకటించారు.


Next Story