బిగ్ అప్డేట్.. ధోనీ రిటైర్మెంట్పై తేల్చేసిన CSK సీఈఓ
IPL 2024లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ప్రయాణం ముగిసింది. CSK తన చివరి లీగ్ మ్యాచ్లో RCB చేతిలో ఓటమిని చవిచూసింది.
By Medi Samrat Published on 24 May 2024 11:20 AM IST
IPL 2024లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ప్రయాణం ముగిసింది. CSK తన చివరి లీగ్ మ్యాచ్లో RCB చేతిలో ఓటమిని చవిచూసింది. ఈ మ్యాచ్లో విజయంతో ఆర్సీబీ జట్టు ప్లేఆఫ్కు చేరి.. ఆ తర్వాత రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓటమి పాలయ్యింది. ఇక సీఎస్కే ఓటమి తర్వాత ఎంఎస్ ధోని రిటైర్మెంట్ గురించి చర్చ నడుస్తుంది. ఇది ధోనీకి చివరి ఐపీఎల్ సీజన్ అని అంతా భావించారు. అయితే ధోనీ భవిష్యత్తు ప్రణాళికలపై CSK CEO కాశీ విశ్వనాథన్ తన మౌనాన్ని వీడారు.
ఈ ఐపీఎల్ సీజన్ ప్రారంభానికి ముందు MS ధోని CSK కెప్టెన్సీని విడిచిపెట్టాడు. అతని స్థానంలో రుతురాజ్ గైక్వాడ్ను CSK కెప్టెన్గా నియమించారు. రుతురాజ్ కెప్టెన్సీలో సీఎస్కే జట్టు ప్లేఆఫ్కు చేరుకోలేకపోయింది. ఇదిలా ఉంటే ధోనీ ఆఖరి ఐపీఎల్ మ్యాచ్ గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. సోషల్ మీడియాలో అభిమానులు చాలా ఎమోషనల్ గా కనిపించారు. అయితే దీనికి సంబంధించి మహి ఇంకా అధికారిక ట్వీట్ చేయలేదు. కానీ CSK తన యూట్యూబ్ ఛానెల్లో CEO కాశీ విశ్వనాథన్ ఇంటర్వ్యూను షేర్ చేసింది. అందులో ఆయన ధోనీ రిటైర్మెంట్ గురించి మాట్లాడారు.
ఈ ప్రశ్నకు సమాధానం నాకు తెలియదని చెన్నై సూపర్ కింగ్స్ సీఈవో కాశీ విశ్వనాథన్ అన్నారు. ఈ ప్రశ్నకు ఎంఎస్ ధోని మాత్రమే సమాధానం చెప్పగలడు. ధోనీ తీసుకున్న నిర్ణయాలను నేను ఎప్పుడూ గౌరవిస్తాను. మేము అతనికి ప్రతిదీ వదిలివేస్తాము. వచ్చే ఏడాది చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడతాడని మాకు చాలా ఆశలు ఉన్నాయి. ఇదే నా అభిమానుల కోరిక అని పేర్కొన్నారు.