క్రికెటర్ రోహిత్ శర్మ, ఆయన తండ్రి గురునాథ్ శర్మ ముంబైలోని లోయర్ పరేల్ ప్రాంతంలో అపార్ట్మెంట్ను 2,60,000 రూపాయల నెలవారీ అద్దెకు ఇచ్చారు. Zapkey.com యాక్సెస్ చేసిన ఆస్తి రిజిస్ట్రేషన్ పత్రాలు ఈ విషయాన్ని బయటపెట్టాయి. అపార్ట్మెంట్, 1,298 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. లోధా గ్రూప్ చేపట్టిన ది పార్క్ ప్రాజెక్ట్లో భాగమైన లోధా మార్క్స్ లోని 45వ అంతస్తులో అపార్ట్మెంట్ ఉంది. ఇందుకు సంబంధించిన లావాదేవీ జనవరి 27 న నమోదు చేశారు. లావాదేవీకి ₹16,300 స్టాంప్ డ్యూటీ, ₹1,000 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించినట్లు పత్రాలు చూపించాయి.
అపార్ట్మెంట్, రెండు పార్కింగ్ స్థలాలను మురళీకృష్ణన్ నాయర్కు లీజుకు ఇచ్చారు. Zapkey.com ద్వారా సేకరించిన ఆస్తి రిజిస్ట్రేషన్ పత్రాల ద్వారా రోహిత్ శర్మ, ఆయన తండ్రి జూలై 2013లో లోధా గ్రూప్ నుండి ₹5.45 కోట్లకు అపార్ట్మెంట్ను కొనుగోలు చేసింది. ఇప్పుడు ఆ ఇంటిని అద్దెకు ఇచ్చారు.