ఇంగ్లాండ్తో జరిగే ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ లో భారత్ తలపడడానికి వారం ముందు, ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ కుటుంబ అత్యవసర పరిస్థితి కారణంగా భారతదేశానికి చేరుకోనున్నారు. ఇంట్రా-స్క్వాడ్ ప్రాక్టీస్ మ్యాచ్కు ముందు గంభీర్ బెకెన్హామ్లో భారత జట్టుతో ఉన్నారు. అయితే అనుకోకుండా గంభీర్ భారత్ కు తిరిగి రావాల్సి వచ్చింది.
గంభీర్ తల్లికి సంబంధించిన ఒక ముఖ్యమైన కుటుంబ అత్యవసర పరిస్థితి కారణంగా ఇంటికి తిరిగి వెళ్తున్నాడని టీమ్ మేనేజ్మెంట్ తెలిపింది. "ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, టెస్ట్ సిరీస్ ప్రారంభానికి ముందు గంభీర్ తిరిగి ఎప్పుడు భారత జట్టులో చేరతాడో ఇంకా తెలియదు" అని సంబంధిత వర్గాలు శుక్రవారం IANSకి తెలిపాయి. గంభీర్ గైర్హాజరీలో, బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్తో పాటు, బౌలింగ్ కోచ్ మోర్నే మోర్కెల్, అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డోస్చేట్, ఫీల్డింగ్ కోచ్ టి దిలీప్ టెస్ట్ సిరీస్కు భారత జట్టును సిద్ధం చేయడంలో సహాయం చేస్తారు.