ఐపీఎల్లో ఇకపై ఆ ప్రకటనలు నిషేధం, కేంద్రం కీలక నిర్ణయం
ఐపీఎల్లో పొగాకు, మద్యం ప్రకటనలను నిషేధించాలని కేంద్రం స్పష్టం చేసింది.
By Knakam Karthik
ఐపీఎల్లో ఇకపై ఆ ప్రకటనలు నిషేధం, కేంద్రం కీలక నిర్ణయం
ఐపీఎల్ నిర్వాహకులకు కేంద్ర ప్రభుత్వ కీలక సూచనలు చేసింది. ఈ నేపథ్యంలో కేంద్రం తీసుకున్న ఓ నిర్ణయంతో నిర్వాహకులకు షాక్ తగిలినట్లయింది. ఐపీఎల్లో పొగాకు, మద్యం ప్రకటనలను నిషేధించాలని కేంద్రం స్పష్టం చేసింది. సరోగసికి సంబంధించిన యాడ్స్ కూడా ప్రసారం చేయవద్దని స్పష్టం చేసింది. యువతకు ఆదర్శంగా ఉండే క్రికెట్ ప్లేయర్లను ఇలాంటి యాడ్స్తో సంబంధం ఉండకూడదని పేర్కొంది. ఈ మేరకు ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్కు కేంద్ర ఆరోగ్యశాఖ లేఖ రాసింది.
'భారత యువతకు ఆదర్శంగా ఉండే క్రికెట్ ఆటగాళ్లకు ఏ రకమైన పొగాకు లేక మద్యం ప్రకటనలతో సంబంధం ఉండకూడదు. ఐపీఎల్, సంబంధిత కార్యక్రమాలు జరిగే స్టేడియం ప్రాంగణాలు, జాతీయ మీడియాలో ప్రసారమయ్యే సెషన్ల సమయంలో పొగాకు, మద్యం ప్రకటనలు ఇవ్వొద్దు. అమ్మకాలపై కూడా నిషేధం ఉంది. ఈ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలి' అని కేంద్రం ఆదేశించింది.
కాగా, మార్చి 22న ఐపీఎల్ ప్రారంభం కానుంది. ఈ లీగ్కు కోట్లలో వ్యూవర్షిప్ ఉంటుంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ సమయంలో ప్రకటనలతో తమ వ్యాపారం పెంచుకోవాలని పలు కంపెనీలు భావిస్తుంటాయి. దీంతో బోర్డుకు కూడా భారీగా ఆదాయం సమకూరుతుంది. కానీ, ప్రభుత్వం తాజా ఆదేశాలు బోర్డు ఆదాయంపై ప్రభావం పడే అవకాశం ఉంది.
Directorate General of Health Services (DGHS) writes to IPL Chairperson regarding the regulation of Tobacco and Alcohol advertisements including surrogate advertisementing and sales during the IPL season starting from 22nd March. pic.twitter.com/0kNvKHzWet
— ANI (@ANI) March 10, 2025