సిరీస్ ఓడి బంగ్లాపై పరువు పోగొట్టుకున్న పాక్..!

పాకిస్థాన్ క్రికెట్ రోజురోజుకూ ఇబ్బంది పడుతోంది. అందుకు కొన్నిసార్లు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తీసుకునే నిర్ణయాలు కార‌ణం కాగా.. మ‌రి కొన్నిసార్లు పాకిస్తాన్ జట్టు ఆట‌తీరు

By Medi Samrat
Published on : 22 July 2025 9:30 PM IST

సిరీస్ ఓడి బంగ్లాపై పరువు పోగొట్టుకున్న పాక్..!

పాకిస్థాన్ క్రికెట్ రోజురోజుకూ ఇబ్బంది పడుతోంది. అందుకు కొన్నిసార్లు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తీసుకునే నిర్ణయాలు కార‌ణం కాగా.. మ‌రి కొన్నిసార్లు పాకిస్తాన్ జట్టు ఆట‌తీరు. ఈసారి పాకిస్థాన్ ఆట‌తీరు హద్దులు దాటింది. మంగళవారం మిర్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20లో బంగ్లాదేశ్ ఎనిమిది పరుగుల తేడాతో పాకిస్థాన్‌ను ఓడించింది. క్రికెట్‌లో గెలుపు ఓటములు ఉంటాయి కానీ బంగ్లాదేశ్‌తో పాక్ జట్టు ఓడిపోయిన తీరు సిగ్గుచేటు.

బంగ్లాదేశ్ 20 ఓవర్లు ఆడి 133 పరుగులకు ఆలౌటైంది. T20ల‌ ప్రకారం.. లక్ష్యం సులభం, కానీ అది కూడా పాక్ జట్టు చేధించ‌లేదు. జట్టు మొత్తం 19.2 ఓవర్లలో 125 పరుగులకు ఆలౌటైంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో బంగ్లాదేశ్‌కు ఇది వరుసగా రెండో విజయం.. దీంతో బంగ్లా సిరీస్ గెలిచి తిరుగులేని 2-0 ఆధిక్యాన్ని సాధించింది. పాకిస్థాన్ జట్టు బ్యాటింగ్ పరిస్థితి మాట్లాడితే.. ఏడుగురు బ్యాట్స్‌మెన్ రెండంకెల స్కోరుకు చేరుకోలేకపోయారు. అందులో ముగ్గురు బ్యాట్స్‌మెన్ ఖాతా తెరవలేకపోయారు.

Next Story