జూలై 10 నుంచి లార్డ్స్లో భారత్తో జరిగే మూడో టెస్ట్ కోసం ఇంగ్లాండ్ జట్టులో చోటు దక్కించుకున్నాడు జోఫ్రా ఆర్చర్. ప్రస్తుతం జరుగుతున్న ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో అత్యధిక వికెట్లు తీసిన జోష్ టంగ్ స్థానంలో ఆర్చర్ చేరాడు. రెండో టెస్ట్ నుండి లైనప్లో ఏకైక మార్పుగా ఆర్చర్ జట్టులో చేరాడు. 30 ఏళ్ల ఆర్చర్ ఫిబ్రవరి 2021 తర్వాత తొలిసారిగా టెస్ట్ జట్టులోకి తిరిగి వచ్చాడు. ఆర్చర్ ఇప్పటివరకు 13 రెడ్-బాల్ మ్యాచ్లలో ఇంగ్లాండ్కు ప్రాతినిధ్యం వహించాడు. ఇంగ్లాండ్ తరపున అతని చివరి టెస్ట్ 2021లో భారత్తో జరిగింది, ఆ తర్వాత అతను వరుస గాయాలతో పోరాడాడు.
మూడో టెస్ట్ కు ఇంగ్లాండ్ జట్టు: జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓల్లీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (C), జేమీ స్మిత్ (wk), జోఫ్రా ఆర్చర్, షోయబ్ బషీర్, బ్రైడాన్ కార్స్, క్రిస్ వోక్స్