ప్రముఖ రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు ఇంట విషాదం
By తోట వంశీ కుమార్ Published on 7 Aug 2020 6:12 AM GMTప్రముఖ రచయిత, నటుడు పరుచూరి వెంకటేశ్వరారవు ఇంట విషాదం నెలకొంది. పరుచూరి వెంకటేశ్వరారవు భార్య విజయలక్ష్మీ శుక్రవారం తెల్లవారు జామున కన్నుమూశారు. ఆమె వయసు 74 సంవత్సరాలు. ఆమె గుండెపోటుతో మృతి చెందారని కుటుంబ సభ్యులు తెలిపారు. విజయలక్ష్మీ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. విజయలక్ష్మీ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపాన్ని తెలియజేశారు.
Also Read
ఆచార్య ఫస్ట్ లుక్ వచ్చేది అప్పుడేనా..!మాటల రచయితగా, నటుడిగా ప్రసిద్ధుడు పరుచూరి వెంకటేశ్వరరావు. సోదరుడు పరుచూరి గోపాలకృష్ణతో కలిసి వందలాది తెలుగు సినిమాలకు కథ, మాటలు, స్క్రీన్ప్లే అందించారు. ఎన్టీఆర్, ఎ.ఎన్.ఆర్, కృష్ణ, శోభన్బాబు, కృష్ణంరాజు చిరజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ సహా పలువురు అగ్ర కథానాయకులందరి సినిమాలకు పరుచూరి బ్రదర్స్ రచయితలుగా పని చేశారు.
Next Story