గూఢచారిగా మారిన జ్యోతి అసలు కథ.. తండ్రి చెప్పిన సంచలన విషయాలు..!
భారత్ తరఫున గూఢచర్యం చేశారన్న ఆరోపణలపై అరెస్టయిన జ్యోతి మల్హోత్రాను పోలీసులు శనివారం కోర్టులో హాజరుపరిచారు.
By Medi Samrat
భారత్ తరఫున గూఢచర్యం చేశారన్న ఆరోపణలపై అరెస్టయిన జ్యోతి మల్హోత్రాను పోలీసులు శనివారం కోర్టులో హాజరుపరిచారు. కోర్టు జ్యోతిని ఐదు రోజుల పోలీసు రిమాండ్కు పంపింది. ఇప్పుడు జ్యోతిని పోలీసులు విచారించనుండగా, ఇందులో పలు విషయాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఈ విషయంలో విద్యుత్ శాఖ నుంచి రిటైర్డ్ ఉద్యోగి అయిన జ్యోతి తండ్రి హరీష్ కుమార్ మల్హోత్రా స్పందన కూడా వెలుగులోకి వచ్చింది. మీడియాతో మాట్లాడిన ఆయన పలు విషయాలు వెల్లడించారు.
ఆమె పాకిస్థాన్కు కాకుండా మరే ఇతర దేశానికి వెళ్లిందో తనకు తెలియదని జ్యోతి తండ్రి చెప్పారు. ఇక జ్యోతి తల్లితో నేను విడాకులు తీసుకున్నానని.. ఆమెతో నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పాడు. గతంలో జ్యోతి ఢిల్లీలో 20 వేల రూపాయల ఉద్యోగం చేసేదని, లాక్డౌన్ విధించినప్పుడు.. మా వస్తువులన్నింటితో ఇక్కడికి వచ్చామని.. అప్పటి నుంచి ఆమె వీడియోలు చేయడం ప్రారంభించిందని తండ్రి చెప్పారు.
యూట్యూబ్ ద్వారా వచ్చే ఆదాయం గురించి తండ్రిని అడిగితే.. తనకు తెలియదని, నేనూ అడగలేదని చెప్పారు. గతంలో ఆమె ఢిల్లీలో పనిచేసేటప్పుడు కేవలం రూ.12వేలు అద్దె చెల్లించేది. ఇప్పుడు ఈ ఇల్లు నా సొంతం అని పేర్కొన్నారు.
పాకిస్థాన్ గూఢచర్యం ఆరోపణలపై పట్టుబడిన హిసార్ నివాసి యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు యూట్యూబ్లో 3.77 లక్షల మంది, ఇన్స్టాగ్రామ్లో 1.31 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇందులో దేశ, విదేశాల్లోని ప్రదేశాలకు వెళ్లేందుకు సంబంధించిన జ్ఞాపకాలు, ప్రదేశానికి సంబంధించిన నిర్దిష్ట సమాచారం పంచుకున్నారు. జ్యోతి ఏ దేశానికి వెళ్లినా.. ఆమె అక్కడి ప్రత్యేక ప్రదేశాలు, ఆహారం, సంస్కృతికి సంబంధించిన వీడియోలను రూపొందించి అప్లోడ్ చేస్తుంది. జ్యోతి వీడియోల్లో పాకిస్థాన్కు సంబంధించిన వీడియోలు కూడా ఉన్నాయి. ఇది కాకుండా, ఇటీవల క్రికెట్ ప్రపంచ కప్ సందర్భంగా భారత్-పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్లకు ప్రేక్షకుల స్పందనను జ్యోతిక వీడియోలను రూపొందించి అప్లోడ్ చేసింది. ఇది కాకుండా.. జ్యోతి కశ్మీర్ టూర్లో ఆర్మీ వ్యక్తులను కూడా చిత్రీకరించిన వీడియోలను కూడా చేసింది. CIA ప్రకారం.. జ్యోతి తన వీడియోలలో పాకిస్తాన్ సానుకూల అంశాలను చూపుతుంది.. అందులో పాకిస్తాన్ పట్ల ఆమె మొగ్గు స్పష్టంగా కనిపిస్తుంది.
పాకిస్థాన్ కోసం గూఢచర్యం చేస్తున్న ఆరుగురిని హిసార్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందులో యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా.. ఆమె ఐదుగురు స్నేహితులు ఉన్నారు. హిసార్లోని న్యూ అగ్రసేన్ ఎక్స్టెన్షన్లో జ్యోతిని అరెస్టు చేశారు. ట్రావెల్ విత్ జో పేరుతో జ్యోతి తన సొంత యూట్యూబ్ ఛానెల్ని నడుపుతోంది.
జ్యోతి మల్హోత్రా తన పాస్పోర్ట్ను 22.10.2018న తీసుకుంది. దీని చెల్లుబాటు 21.10.2028 వరకు ఉంది. ఆమె ఢిల్లీ నుండి సిక్కు ఖైదీల బృందంతో రెండుసార్లు.. ఒకసారి ఒంటరిగా పాకిస్తాన్లోని కర్తార్పూర్ సాహిబ్ గురుద్వారాకు వెళ్ళింది. ఇది కాకుండా దుబాయ్, థాయ్లాండ్, ఇండోనేషియా, నేపాల్, భూటాన్, చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ మొదలైన దేశాలకు కూడా ప్రయాణించింది.
2023 సంవత్సరానికి వీసా కోసం తాను పాకిస్థాన్ హైకమిషన్కు వెళ్లానని.. అక్కడ అహ్సన్ ఉర్ రహీమ్ అలియాస్ డానిష్ను కలిశానని జ్యోతి పోలీసులకు తెలిపింది. డానిష్ మొబైల్ నంబర్ తీసుకున్నాడు. ఇద్దరూ మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఆ తర్వాత రెండుసార్లు పాకిస్థాన్లో పర్యటించినట్లు పేర్కొంది.