పోలీసు స్టేషన్ లో వ్యక్తి మృతి.. పోలీసులే అతడిని చంపేశారంటూ..

UP Man Dies In Police Station. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని పోలీసు స్టేషన్ లో 22 సంవత్సరాల వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు.

By Medi Samrat  Published on  10 Nov 2021 11:09 AM GMT
పోలీసు స్టేషన్ లో వ్యక్తి మృతి.. పోలీసులే అతడిని చంపేశారంటూ..

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని పోలీసు స్టేషన్ లో 22 సంవత్సరాల వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే పోలీసులే అతడిని చంపేశారంటూ మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఉన్నారు. రాష్ట్ర రాజధాని లక్నోకు పశ్చిమాన 270 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉత్తరప్రదేశ్‌లోని ఎటాహ్ జిల్లాలో 22 ఏళ్ల వ్యక్తి మంగళవారం నాడు పోలీసు స్టేషన్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఉన్నతాధికారులు ఐదుగురు పోలీసులను సస్పెండ్ చేశారు. మహిళను కిడ్నాప్ చేసి బలవంతంగా వివాహం చేసుకున్నందుకు గత వారం దాఖలు చేసిన కేసులో విచారణ కోసం అల్తాఫ్ అనే వ్యక్తిని మంగళవారం ఉదయం పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు.

ఎటా పోలీస్ చీఫ్ రోహన్ ప్రమోద్ బోత్రే తో ఆ వ్యక్తి పోలీస్ స్టేషన్‌లో మరుగుదొడ్డికి వెళ్లాలని అడిగాడు. కొన్ని నిమిషాల తర్వాత కూడా అతడు తిరిగి రాకపోవడంతో పోలీసులు లోపలికి వెళ్లి చూడగా అతడి నుండి రక్తం కారుతూ ఉండడాన్ని గమనించారు. గొంతు కోసుకోవడానికి ప్రయత్నించినట్లు తెలుస్తోంది. అతను అపస్మారక స్థితిలో ఉండగా ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. ఈ కేసులో సస్పెండ్ అయిన ఐదుగురు పోలీసులు విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా ప్రవర్తించారని అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

దేశంలోని అన్ని పోలీసు స్టేషన్లు, సీబీఐ, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌తో సహా దర్యాప్తు ఏజెన్సీలు రాత్రి విజన్, ఆడియో రికార్డింగ్‌తో కూడిన సీసీటీవీ కెమెరాలను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని గతేడాది డిసెంబర్‌లో సుప్రీంకోర్టు ఆదేశించింది. రాష్ట్రాలలోని అన్ని పోలీసు స్టేషన్లలో ఆడియో కెమెరాలను ఏర్పాటు చేయాలని కోర్టు పేర్కొంది. విచారణ గదులు, లాక్‌అప్‌లు, ఎంట్రీలు మరియు నిష్క్రమణలను సెక్యూరిటీ కెమెరాలతో కవర్ చేయాలని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. అయితే.. ఉత్తరప్రదేశ్‌లోని ఎన్ని పోలీస్ స్టేషన్లలో ఇప్పటివరకు సీసీటీవీలు ఉన్నాయో స్పష్టంగా తెలియలేదు.


Next Story