భారత్‌లో సుదీర్ఘ చంద్రగ్రహణం.. ఎరుపెక్కిన చంద్రుడిని ఎప్పుడు చూడొచ్చంటే..

ఈ సంవత్సరం సుదీర్ఘ చంద్రగ్రహణం సెప్టెంబర్ 7న భారతదేశంలో కనిపిస్తుంది.

By Medi Samrat
Published on : 6 Sept 2025 8:36 PM IST

భారత్‌లో సుదీర్ఘ చంద్రగ్రహణం.. ఎరుపెక్కిన చంద్రుడిని ఎప్పుడు చూడొచ్చంటే..

ఈ సంవత్సరం సుదీర్ఘ చంద్రగ్రహణం సెప్టెంబర్ 7న భారతదేశంలో కనిపిస్తుంది. ఈ చంద్రగ్రహణం భారతదేశంలోని చాలా ప్రాంతాలలో కనిపిస్తుంది, అందువల్ల ప్రజలలో దీని పట్ల ఉన్న ఉత్సాహం కూడా అలాగే ఉంది. నెహ్రూ సెంటర్ ప్లానిటోరియం (ముంబయి) డైరెక్టర్ అరవింద్ పరాంజపే ప్రకారం.. చంద్రగ్రహణం సెప్టెంబర్ 7 రాత్రి 8.58 గంటలకు ప్రారంభమవుతుంది.

సంపూర్ణ చంద్రగ్రహణం రాత్రి 11.01 గంటలకు సంభవిస్తుంది. రాత్రి 11.42 గంటలకు గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. ఈ సమయంలో చంద్రుడు ఎరుపు రంగుకు మారుతాడు. సెప్టెంబర్ 8వ తేదీ తెల్లవారుజామున 1:26 గంటలకు చంద్రగ్రహణం ముగుస్తుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. గ్రహణం సమయంలో భూమి మీద నీలం కాంతి ఉంటుంది. అదే సమయంలో ఎరుపు కాంతి చంద్ర ఉపరితలంపైకి చేరుకుంటుంది. అందుకే చంద్రుడు ఎర్రగా కనిపిస్తాడు.

చంద్రగ్రహణం అత్యంత అందమైన ఖగోళ దృగ్విషయాలలో ఒకటి. భారతదేశంలో వాతావరణం స్పష్టంగా ఉంటే.. ఈ అద్భుతమైన 82 నిమిషాల ఈవెంట్ దేశంలోని చాలా ప్రాంతాలలో కనిపిస్తుంది. పురాతన కాలంలో ప్రజలకు దాని గురించి తెలియనప్పుడు.. చంద్రగ్రహణంపై అనేక రకాల మూఢనమ్మకాలు ప్రబలంగా ఉన్నాయి. భారతీయ గణిత శాస్త్రజ్ఞుడు, ఖగోళ శాస్త్రవేత్త ఆర్యభట్ట ప్రజలకు గ్రహణం గురించి శాస్త్రీయ దృక్పథాన్ని అందించారు. తరువాత ఈ వాదనలు ప్రజల భయాన్ని, మూఢనమ్మకాలను తొలగించడంలో సహాయపడ్డాయి. అయినప్పటికీ చాలా మంది ఇప్పటికీ గ్రహణం సమయంలో ఇంటి నుండి బయటకు వెళ్లడం లేదా ఏదైనా తినడం మానేస్తారు. కానీ దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. గ్రహణాన్ని కంటితో చూడకూడదని చాలా మంది నమ్ముతారు. సూర్యగ్రహణం విషయంలో ఇది పూర్తిగా నిజం, కానీ చంద్రగ్రహణం విషయంలో అలా కాదు. చంద్ర గ్రహణాన్ని వీక్షించడం పూర్తిగా సురక్షితమైనది. ఈ అద్భుతమైన ఖగోళ దృగ్విషయాన్ని చూడటంలోనే థ్రిల్లింగ్‌గా ఉంటుంది.

Next Story