రేపు ఎన్నికల సంఘం కీల‌క‌ సమావేశం.. ఏ క్ష‌ణంలోనైనా..

ఐదు రాష్ట్రాల్లో ఎప్పుడైనా ఎన్నికల న‌గారా మోగవచ్చు. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించే

By Medi Samrat  Published on  5 Oct 2023 9:45 AM GMT
రేపు ఎన్నికల సంఘం కీల‌క‌ సమావేశం.. ఏ క్ష‌ణంలోనైనా..

ఐదు రాష్ట్రాల్లో ఎప్పుడైనా ఎన్నికల న‌గారా మోగవచ్చు. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించే ముందు ఎన్నికల సంఘం ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు రేపు (శుక్రవారం) పరిశీలకుల సమావేశాన్ని ఏర్పాటు చేసింది. పోలీసు, సాధారణ, వ్యయ పరిశీలకులతో ఎన్నికల సంఘం రోజంతా సమావేశమై ఎన్నికల వ్యూహాన్ని రూపొందించడమే కాక‌ ఎన్నికలను సక్రమంగా నిర్వహించేందుకు కమిషన్ చర్యలు తీసుకోనుంది. ఈసీ ఇప్పటివరకు రాజస్థాన్, మిజోరాం, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో ఎన్నికల సన్నాహాలను పరిశీలించింది. తెలంగాణ సన్నాహకాలను ఈరోజు చూడనున్నారు.

మరికొద్ది రోజుల్లో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల పోల్ ప్యానెల్ ప్రకటించే అవ‌కాశం ఉంది. ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, తెలంగాణ, మిజోరాం, రాజస్థాన్‌లలో నవంబర్-డిసెంబర్లలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. మిజోరాం అసెంబ్లీ పదవీకాలం ఈ ఏడాది డిసెంబర్ 17తో ముగియనుంది. ఈశాన్య రాష్ట్రంలో మిజో నేషనల్ ఫ్రంట్ అధికారంలో ఉంది. తెలంగాణ, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ అసెంబ్లీల పదవీకాలం కూడా వేర్వేరు తేదీల్లో ముగియనుంది. తెలంగాణలో భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) అధికారంలో ఉండగా, మధ్యప్రదేశ్‌లో బీజేపీ అధికారంలో ఉంది. ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌లలో కాంగ్రెస్‌ ప్రభుత్వాలున్నాయి.

Next Story