ప్రధాన మంత్రి సెక్యూరిటీగా ఉన్న కమాండో పర్స్ కొట్టేశారు

The purse of the jawan posted in PM's security was stolen. మహారాష్ట్ర రాజధాని ముంబైలో లోకల్ రైలులో ప్రయాణిస్తుండగా ప్రధాని నరేంద్ర మోదీ భద్రతలో

By Medi Samrat  Published on  27 Nov 2021 11:57 AM GMT
ప్రధాన మంత్రి సెక్యూరిటీగా ఉన్న కమాండో పర్స్ కొట్టేశారు

మహారాష్ట్ర రాజధాని ముంబైలో లోకల్ రైలులో ప్రయాణిస్తుండగా ప్రధాని నరేంద్ర మోదీ భద్రతలో కీలక పాత్ర పోషించిన స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ కమాండోల పర్సు చోరీకి గురైంది. కమాండోలు విలేపార్లే నుంచి మహాలక్ష్మికి వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు తెలిసింది. కమాండోను సుభాష్ చంద్రగా గుర్తించారు. ఫిర్యాదు అందడంతో ఈ కేసులో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పర్సును దొంగిలించి ఎస్పీజీ కమాండో డెబిట్, క్రెడిట్ కార్డుల నుంచి నిందితులు వేల రూపాయలు ఖర్చు చేశారు.

నేరస్థుడు వృత్తిరీత్యా దొంగ అని, ఇంతకుముందు కూడా పలు కేసుల్లో అతడి పేరు వెలుగులోకి వచ్చిందని పోలీసులు తెలిపారు. ప్రజల పర్సులు కొట్టి క్రెడిట్‌, డెబిట్‌ కార్డుల నుంచి అక్రమంగా డబ్బులు విత్‌డ్రా చేసేవాడని గతంలో పలు కేసులు నమోదయ్యాయి. నవంబర్ 7న ఈ ఘటన చోటు చేసుకుంది. 3 సంవత్సరాల డిప్యుటేషన్‌పై SPG లో పోస్ట్ చేయబడిన చంద్ర ఇటీవల ముంబైకి వచ్చారు. ఫిర్యాదు చేసిన తర్వాత పోలీసులు సత్వర చర్యలు చేపట్టి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.


Next Story