కేంద్ర ప్రభుత్వానికి షాక్..యూజీసీ నిబంధనలపై సుప్రీంకోర్టు స్టే

యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) తీసుకొచ్చిన కొత్త నిబంధనలపై సుప్రీంకోర్టు స్టే విధించింది.

By -  Knakam Karthik
Published on : 30 Jan 2026 10:20 AM IST

National News, Delhi, Supreme Court, UGC Equity Regulations, Equity Committees, Central Government

కేంద్ర ప్రభుత్వానికి షాక్..యూజీసీ నిబంధనలపై సుప్రీంకోర్టు స్టే

కుల ఆధారిత వివక్షను రద్దు చేసి, ఉన్నత విద్యాసంస్థల్లో సమానత్వాన్ని పెంపొందించడానికి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) తీసుకొచ్చిన కొత్త నిబంధనలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. గురువారం ఈ నిబంధనలను సవాల్‌ చేస్తూ దాఖలైన పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్ (PIL)పై విచారణలో, అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ మార్గదర్శకాలు అస్పష్టంగా ఉన్నాయని, వీటిని దుర్వినియోగం చేసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో కేంద్రం,యూజీసీకి నోటీసులు జారీ చేస్తూ, తదుపరి నోటీసులు వచ్చే వరకు నిబంధనలపై స్టే అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది.

రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 కింద తనకున్న పూర్తి అధికారాలను ప్రయోగిస్తూ, విశ్వవిద్యాలయ గ్రాంట్స్ కమిషన్ (ఉన్నత విద్యా సంస్థలలో సమానత్వాన్ని ప్రోత్సహించడం) నిబంధనలు, 2026 యొక్క ఆపరేషన్‌ను సుప్రీం కోర్టు నిలిపివేసింది, ఈ నిబంధనలు కుల ఆధారిత వివక్షకు చేర్చని నిర్వచనాన్ని స్వీకరించాయని మరియు సంస్థాగత రక్షణ నుండి కొన్ని వర్గాలను మినహాయించాయని వాదించే పిటిషన్లపై భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ మరియు జస్టిస్ జోయ్‌మల్య బాగ్చిలతో కూడిన ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం కేంద్రానికి మరియు UGCకి నోటీసులు జారీ చేసింది.

స్వాతంత్ర్యం వచ్చిన కొన్ని దశాబ్దాల తర్వాత కూడా మన సమాజం కులవివక్షల నుంచి పూర్తిగా విముక్తమైంది అని చెప్పలేము. ఇలాంటి పరిస్థితుల్లో, సమాజాన్ని వెనక్కి తీసుకెళ్తున్నామా అనే ఆలోచన కలుగుతుంది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాల విద్యార్థులు తమ సంప్రదాయాలకు అనుగుణంగా వ్యవహరిస్తారు. కానీ, కొంతమంది 'ర్యాగింగ్' అనే పేరుతో వారిని అవహేళన చేయడం దురదృష్టకరం. దీన్ని నివారించడానికి ప్రత్యేక హాస్టళ్లు ఏర్పాటు చేయాలని సిఫార్సు జరుగుతోంది. అయినప్పటికీ, సమాజంలో కులాంతర వివాహాలు సాధారణమై ఉన్నాయి, హాస్టళ్లలోనూ విద్యార్థులు కలిసే వాతావరణంలో ఉంటారు. అలాగే, ఐక్యభారత విధానాన్ని విద్యాసంస్థల్లో స్పష్టంగా ప్రతిబింబించాలి. మేము విద్యాసంస్థల్లో స్వేచ్ఛ, సమానత్వం, సమ్మిళిత వాతావరణాన్ని మేం కోరుకుంటున్నాం'' అని విచారణ సందర్భంగా సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది.

Next Story