చార్‌ధామ్‌ రహదారి విస్తరణకు సుప్రీం ఒకే.. సరిహద్దులకు వేగంగా యుద్ధ ట్యాంకులు, క్షిపణి లాంఛర్లు

Supreme Court approves Char Dham Road widening. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చార్ ధామ్ రోడ్డు విస్తరణ ప్రాజెక్టులో భాగంగా రోడ్ల విస్తరణను సుప్రీంకోర్టు ఆమోదించింది. ఈ సందర్భంగా సాయుధ బలగాల

By అంజి  Published on  14 Dec 2021 9:30 AM GMT
చార్‌ధామ్‌ రహదారి విస్తరణకు సుప్రీం ఒకే.. సరిహద్దులకు వేగంగా యుద్ధ ట్యాంకులు, క్షిపణి లాంఛర్లు

కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చార్ ధామ్ రోడ్డు విస్తరణ ప్రాజెక్టులో భాగంగా రోడ్ల విస్తరణను సుప్రీంకోర్టు ఆమోదించింది. ఈ సందర్భంగా సాయుధ బలగాల మౌలిక సదుపాయాల అవసరాలను ఊహించలేము కదా అని కోర్టు పేర్కొంది. ఇటీవలి కాలంలో సరిహద్దుల వెంబడి భద్రతకు తీవ్ర సవాళ్లు ఎదురవుతున్నాయని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. పర్యావరణ ప్రయోజనాల దృష్ట్యా అన్ని పరిష్కార చర్యలు చేపట్టాలని, ప్రాజెక్ట్‌తో ముందుకు సాగుతున్నప్పుడు కమిటీ సిఫార్సులను అమలు చేయడం కోసం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి AK సిక్రీ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ప్రతి 4 నెలలకు ఒకసారి ప్రాజెక్టుపై నివేదిక రూపొందించి కోర్టుకు సమర్పిస్తుంది.

ఈ రహదారి నిర్మాణంతో భారత సైన్యం యుద్ధ ట్యాంకులు, ఆయుధాలతో సరిహద్దుకు చేరుకోవడం సులభతరం అవుతుందని, పర్వత ప్రాంతాల్లో కనెక్టివిటీ పెరుగుతుందని రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. రూ. 12,000 కోట్ల విలువైన 900-కిమీ చార్‌ధామ్ ప్రాజెక్ట్.. నాలుగు పవిత్ర పట్టణాలు -- యమునోత్రి, గంగోత్రి, కేదార్‌నాథ్ మరియు బద్రీనాథ్‌లకు ఆల్-వెదర్ కనెక్టివిటీని అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. కోర్టు ఏర్పాటు చేసిన ఈ కమిటీకి రక్షణ, రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖలు, ఉత్తరాఖండ్ ప్రభుత్వం, అన్ని జిల్లాల మేజిస్ట్రేట్ల నుండి అన్ని మద్దతు లభిస్తుంది. రక్షణ మంత్రిత్వ శాఖ దాఖలు చేసిన దరఖాస్తులో ఎలాంటి అవకతవకలు లేవని సుప్రీంకోర్టు పేర్కొంది. ప్రభుత్వం యొక్క ప్రత్యేక సంస్థగా, సైనికుల కదలికను సులభతరం చేయడానికి అవసరమైన మౌలిక సదుపాయాలతో సహా సాయుధ దళాల కార్యాచరణ అవసరాలను నిర్ణయించే హక్కు రక్షణ మంత్రిత్వ శాఖకు ఉందని పేర్కొంది.

సైన్యం తన క్షిపణి లాంచర్లు, భారీ యంత్రాలను ఉత్తర ఇండో-చైనా సరిహద్దు వరకు తరలించలేకపోతే, ఒక వేళ యుద్ధం వస్తే ఎలా విరుచుకుపడుతామని కేంద్రం గతంలో సుప్రీంకోర్టుకు ఇచ్చిన పోజర్‌లో పేర్కొంది. విశాలమైన చార్‌ధామ్ హైవే ప్రాజెక్ట్ నిర్మాణం కారణంగా హిమాలయ ప్రాంతాలలో కొండచరియలు విరిగిపడతాయనే ఆందోళనలను తగ్గించడానికి ప్రయత్నిస్తూ, విపత్తును తగ్గించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయని, ప్రత్యేకంగా రోడ్డు నిర్మాణం వల్ల కాదని పేర్కొంది. సరిహద్దు వరకు వెళ్లే ప్రతిష్టాత్మక హైవే ప్రాజెక్ట్‌లో క్యారేజ్‌వే వెడల్పు 5.5 మీటర్లు ఉండేలా 2018 సర్క్యులర్‌ను అనుసరించాలని రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖను కోరిన సెప్టెంబర్ 8, 2020 ఆర్డర్‌ను సవరించాలని కోరుతూ కేంద్రం చేసిన పిటిషన్‌ను కోర్టు విచారించింది.

Next Story