ఆసుప‌త్రి నుంచి డిశ్చార్జీ అయిన సోనియా గాంధీ

Sonia Gandhi Leaves Hospital. కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్య‌క్షురాలు సోనియా గాంధీ సోమ‌వారం సాయంత్రం

By Medi Samrat  Published on  20 Jun 2022 2:46 PM GMT
ఆసుప‌త్రి నుంచి డిశ్చార్జీ అయిన సోనియా గాంధీ

కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్య‌క్షురాలు సోనియా గాంధీ సోమ‌వారం సాయంత్రం ఆసుప‌త్రి నుంచి డిశ్చార్జీ అయ్యారు. క‌రోనా సోకిన నేప‌థ్యంలో చికిత్స నిమిత్తం ఆమె ఢిల్లీలోని స‌ర్ గంగారామ్ ఆసుప‌త్రిలో చేర్చారు. వారం రోజుల పాటు ఆసుప‌త్రిలో చికిత్స తీసుకున్న ఆమె క‌రోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. దీంతో ఆమెను ఆసుప‌త్రి వైద్యులు సోమ‌వారం సాయంత్రం డిశ్చార్జీ చేశారు. కాసేప‌టి క్రితం సోనియా గాంధీ ఆసుప‌త్రి నుంచి త‌న నివాసానికి చేరుకున్నారు.

నేష‌న‌ల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీతో పాటు సోనియా గాంధీకి కూడా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ స‌మ‌న్లు జారీ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈడీ స‌మ‌న్లు అందుకున్నాకే సోనియా గాంధీ క‌రోనా బారిన ప‌డ్డారు. వ‌య‌సు రీత్యా నెల‌కొన్న అనారోగ్య స‌మ‌స్య‌ల నేప‌థ్యంలో ఆమెను స‌ర్ గంగారామ్ ఆసుప‌త్రికి త‌ర‌లించారు.






Next Story