శబరిమల బంగారు ఆభరణాల చోరీ కేసు.. నటుడు జయరామ్‌ను విచారించిన సిట్‌..!

శబరిమల అయ్యప్ప స్వామి ఆలయానికి సంబంధించిన బంగారు ఆభరణాల చోరీ కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక విచారణ బృందం (SIT) ప్రముఖ నటుడు జయరామ్‌ ను చూడా ప్రశ్నించింది.

By -  Medi Samrat
Published on : 30 Jan 2026 1:07 PM IST

శబరిమల బంగారు ఆభరణాల చోరీ కేసు.. నటుడు జయరామ్‌ను విచారించిన సిట్‌..!

శబరిమల అయ్యప్ప స్వామి ఆలయానికి సంబంధించిన బంగారు ఆభరణాల చోరీ కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక విచారణ బృందం (SIT) ప్రముఖ నటుడు జయరామ్‌ ను చూడా ప్రశ్నించింది. చెన్నైలోని ఆయన స్వగృహంలోనే ఈ విచారణ జరిగినట్లుగా తెలుస్తోంది. అయితే, ఈ కేసులో ప్రధాన నిందితుడైన ఉన్నికృష్ణన్ పొట్టితో జయరామ్‌కు ఉన్న పరిచయంపై అధికారులు ఆరా తీశారు.

2019లో చెన్నైలో ఉన్నికృష్ణన్ పొట్టి ఆధ్వర్యంలో జరిగిన ఓ పూజా కార్యక్రమంలో జయరామ్ పాల్గొన్నారు. సిట్ విచారణ అనంతరం జయరామ్ మీడియాతో మాట్లాడారు. కేవలం భక్తితో ఆహ్వానం మేరకే తాను ఆ రోజు పూజలో పాల్గొన్నానని, అంతకు మించి నగలు మాయమైన వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఈ కేసులో జయరామ్‌ను ఓ సాక్షిగా పరిగణించి ఆయన స్టేట్‌మెంట్‌ను సిట్ రికార్డ్ చేసినట్లుగా తెలుస్తోంది.

Next Story