'రెక్కలు నీవి, ఆకాశం ఎవ‌రి సొత్తు కాదు..' ఖర్గేపై శశి థరూర్ ఎదురుదాడి

ప్రస్తుతం కాంగ్రెస్‌లో ప‌లువురు నేత‌ల మ‌ధ్య ప‌రిస్థితి అంతా బాగా లేదు.

By Medi Samrat
Published on : 25 Jun 2025 5:04 PM IST

రెక్కలు నీవి, ఆకాశం ఎవ‌రి సొత్తు కాదు.. ఖర్గేపై శశి థరూర్ ఎదురుదాడి

ప్రస్తుతం కాంగ్రెస్‌లో ప‌లువురు నేత‌ల మ‌ధ్య ప‌రిస్థితి అంతా బాగా లేదు. తిరువనంతపురం ఎంపీ శశిథరూర్‌, కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే మధ్య ఇటీవలి టెన్షన్‌ నేపథ్యంలో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేప‌థ్యంలోనే ఖర్గే.. శ‌శి థరూర్ పేరు చెప్పకుండానే ఆయ‌న‌ను లక్ష్యంగా చేసుకుంటూ.. కొంతమందికి మోదీ మొదటి ఆప్ష‌న్‌, దేశం రెండవ ఆప్ష‌న్ అని అన్నారు.

దీనిపై శశి థరూర్ ఎదురుదాడి చేశారు. రెక్కలు నీవే.. కానీ ఆకాశం ఎవరి సొత్తు కాదు అని అన్నారు. విమానంలో ప్రయాణించేందుకు అనుమతి తీసుకోనవసరం లేదన్నారు. ఇంతకు ముందు కూడా.. చాలా సందర్భాలలో థరూర్ అభిప్రాయం, పార్టీ శ్రేణికి భిన్నంగా ఉంది. ఆ తర్వాత చాలా మంది కాంగ్రెస్ నాయకులు ఆయ‌న‌పై ఎదురుదాడి చేశారు.

శశి థరూర్ తనపై నిరంతరం లేవనెత్తుతున్న ప్రశ్నలకు సమాధానమివ్వడానికి సోషల్ మీడియా సహాయం తీసుకున్నారు. ఆయ‌న‌ సోషల్ మీడియా సైట్ ఎక్స్‌లో పక్షి చిత్రాన్ని పోస్ట్ చేశాడు. ఈ చిత్రంతోపాటు 'ఎగరడానికి అనుమతి అడగవద్దు.. రెక్కలు నీవే.. ఆకాశం ఎవరి సొత్తు కాదు అని రాసుకొచ్చారు.

ఆపరేషన్ సింధూర్ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా ప‌ర్య‌టించిన‌ అఖిలపక్ష ఎంపీల బృందంలో శశి థరూర్ కూడా ఉన్నారు. పార్టీలోనే చాలాసార్లు వ్యతిరేకతను ఎదుర్కొన్న శశిథరూర్.. ఈసారి బహిరంగ వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వచ్చింది. థరూర్‌ను బీజేపీకి సూపర్‌ స్పోక్స్‌పర్సన్‌ అని కూడా కాంగ్రెస్‌ ఆరోపించింది. ప్రధాని మోదీని ప్రశంసించినందుకు పలువురు కాంగ్రెస్ నేతలు ఆయనపై మండిపడ్డారు.

Next Story