కాలికి బ్యాండేజ్ తో శశి థరూర్.. కారణం ఏమిటంటే..?

Shashi Tharoor ‘immobilised’ after missing step in Parliament. కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ పార్లమెంటులో మెట్లు దిగుతూ గాయపడ్డారు.

By Medi Samrat  Published on  16 Dec 2022 3:00 PM GMT
కాలికి బ్యాండేజ్ తో శశి థరూర్.. కారణం ఏమిటంటే..?

కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ పార్లమెంటులో మెట్లు దిగుతూ గాయపడ్డారు. పార్లమెంటు సమావేశాలకు హాజరైన థరూర్... మెట్లు దిగే క్రమంలో జారిపడ్డారు. ఎడమ కాలు బెణకడంతో ఓ దశలో నడవడానికి ఇబ్బంది పడ్డారు. నొప్పి తీవ్రం కావడంతో ఆసుపత్రికి వెళ్లారు. కాలుకు బ్యాండేజ్ వేయించుకున్న థరూర్ తన తన నివాసానికే పరిమితమయ్యారు. ప్రస్తుతం తాను నడవలేని స్థితిలో ఉన్నానని, నియోజకవర్గంలో కార్యక్రమాలను రద్దు చేసుకున్నానని ట్వీట్ చేశారు. ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నానని సోషల్ మీడియా ద్వారా చెప్పుకొచ్చారు శశిథరూర్.

గురువారం పార్లమెంట్‌ మెట్లపై జారిపడటంతో ఎడమ కాలు బెణికింది. ఈ విషయాన్ని శశిథరూర్‌ ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. తీవ్రమైన నొప్పి కారణంగా ప్రస్తుతం కదల్లేని పరిస్థితుల్లో ఉన్నట్లు చెప్పారు. ఈ మేరకు ఫొటోలను షేర్‌ చేశారు. "A bit of an inconvenience: I badly sprained my left foot in missing a step in Parliament yesterday. After ignoring it for a few hours the pain had become so acute that I had to go to hospital. Am now immobilised w/a cast, missing Parliament today&cancelled wknd constituency plans" అంటూ ట్వీట్ చేశారు శశిథరూర్.


Next Story