Bihar Results : '10-10 వేల రూపాయలు ఇచ్చారు'.. శరద్ పవార్ తీవ్ర ఆరోపణలు

ఇటీవల జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే విజయంపై ప్రభుత్వ మద్దతుతో నగదు బదిలీ పథకం ప్రభావం చూపిందని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ ఆరోపించారు.

By -  Medi Samrat
Published on : 15 Nov 2025 7:20 PM IST

Bihar Results : 10-10 వేల రూపాయలు ఇచ్చారు.. శరద్ పవార్ తీవ్ర ఆరోపణలు

ఇటీవల జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే విజయంపై ప్రభుత్వ మద్దతుతో నగదు బదిలీ పథకం ప్రభావం చూపిందని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ ఆరోపించారు. దీని కింద ఓటు వేయడానికి కొద్దిసేపటి ముందు మహిళా ఓటర్ల బ్యాంకు ఖాతాల్లో రూ.10 వేలు జమ చేశారన్నారు. ఇంత పెద్ద ఎత్తున ఎన్నికలకు ముందు చెల్లింపులు చేయడం వల్ల ప్రజాస్వామ్య ప్రక్రియపై ప్రజల విశ్వాసం దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

బీహార్ నుండి తనకు ఫీడ్‌బ్యాక్ అందిందని, అసాధారణంగా పెద్ద సంఖ్యలో ఓటు వేసిన మహిళలపై రూ. 10,000 డిపాజిట్ మొత్తం బాగా ప్రభావితం చూపింద‌ని పవార్ అన్నారు. మహిళలు ఎన్నికలను తమ చేతుల్లోకి తీసుకున్నారని ఆరోపించారు. ఒక్కొక్కరి ఖాతాల్లోకి రూ. 10,000 వచ్చిందని, అది ఫలితాలపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపింది.’’ మహారాష్ట్రకు చెందిన లడ్కీ బెహెన్ పథకంతో పోల్చిన పవార్.. ఎన్నికలకు ముందు ప్రభుత్వాలు భారీ మొత్తంలో డబ్బు పంపిణీ చేస్తున్న తీరు ఆందోళన కలిగిస్తోందన్నారు.

అధికారంలో ఉన్న వ్యక్తులు ఇలా డబ్బు పంచి ఎన్నికల్లో పోటీ చేస్తే ప్రజలకు ఎన్నికలపై నమ్మకం పోతుందని.. రూ.10వేలు అంటే చిన్న మొత్తం కాదని.. దాని ప్రభావం గురించి నిపుణులు, ఎన్నికల సంఘం ఆలోచించాలని అన్నారు. ఇలాంటి పద్ధతులు పారదర్శకతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయని పవార్ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.10వేలు ఇచ్చి ఆ తర్వాత ఎన్నికలు జరిగినప్పుడు సహజంగానే ఈ ప్రక్రియ అపరిశుభ్రంగా లేదనే భావన ప్రజల్లో ఉందన్నారు.

Next Story