తిరిగి తెరుచుకున్న స్కూళ్లు.. పలు చోట్ల 144 సెక్షన్‌

Schools reopen in Karnataka after five days amid tensions. కర్నాటకలోని పాఠశాలలు సోమవారం తిరిగి తెరవబడ్డాయి. హిజాబ్ వివాదం కారణంగా రాష్ట్రంలోని విద్యా సంస్థలను మూసివేయాలని

By అంజి  Published on  14 Feb 2022 11:02 AM GMT
తిరిగి తెరుచుకున్న స్కూళ్లు.. పలు చోట్ల 144 సెక్షన్‌

కర్నాటకలోని పాఠశాలలు సోమవారం తిరిగి తెరవబడ్డాయి. హిజాబ్ వివాదం కారణంగా రాష్ట్రంలోని విద్యా సంస్థలను మూసివేయాలని ప్రభుత్వాన్ని ప్రేరేపించింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం విద్యా సంస్థలను తిరిగి ప్రారంభించింది. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహిస్తున్నారు. కొన్ని పాఠశాలల్లో, కొంతమంది బాలికలు హిజాబ్‌తో ప్రవేశించడానికి అనుమతించబడలేదు. దీంతో పాఠశాలల యాజమాన్యాలకు, విద్యార్థుల తల్లిదండ్రులకు మధ్య వాగ్వాదం ఘటనలు చోటు చేసుకున్నాయి.

సోమవారం నుంచి ఫిబ్రవరి 19 వరకు మంగళూరు పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అన్ని ఉన్నత పాఠశాలల పరిధిలో 200 మీటర్ల పరిధిలో సీఆర్‌పీసీ సెక్షన్ 144 కింద నిషేధాజ్ఞలు విధించారు. హిజాబ్ వివాదాన్ని దృష్టిలో ఉంచుకుని ముందు జాగ్రత్త చర్యలో భాగంగా ఈ చర్య తీసుకున్నారు. హైకోర్టు ఆదేశాలతో కర్ణాటక ప్రభుత్వం.. స్కూళ్లను పునఃప్రారంభించింది. మరో వైపు ఇంటర్‌మీడియట్‌ విద్యార్థుల కాలేజీలు బుధవారం వరకు మూసి ఉండనున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితులు పూర్తిగా అదుపులోనే ఉన్నాయని ప్రభుత్వం పేర్కొంది. మంగళూరు పోలీస్‌ కమిషనరేట్‌తో పాటు ఉడుపి, శివమొగ్గ, దక్షిణ కన్నడ జిల్లాల్లో సెక్షన్‌ 144 అమలు చేస్తున్నారు.

Next Story