జులై 1 నుంచి ఎస్‌బీఐ సరికొత్త రూల్స్‌..

SBI New Rules From July 1st. భారత అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సరికొత్త నిబంధనలు

By Medi Samrat  Published on  25 Jun 2021 4:19 PM GMT
జులై 1 నుంచి ఎస్‌బీఐ సరికొత్త రూల్స్‌..

భారత అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సరికొత్త నిబంధనలు వచ్చే నెల 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. క్యాష్ విత్‌డ్రా, చెక్ బుక్‌ల విషయంలో సవరించిన సర్వీస్ చార్జీలు జూలై 1 నుంచి అమలు కానున్నాయి. ఇకపై ఎస్‌బీఐ బ్రాంచ్ ఏటీఎంలతోపాటు మిగిలిన ఏటీఎంల్లో నెలకు నాలుగుసార్లు మాత్రమే డబ్బులను ఉచితంగా విత్‌డ్రా చేసుకోవచ్చు. ఆపై క్యాష్ విత్‌‌డ్రా చేసుకుంటే అదనపు ఛార్జీలను కట్టాల్సి ఉంటుంది. బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ (బీఎస్‌‌బీడీ) ఖాతాదారులకు ఈ రూల్స్ వర్తించనున్నాయి.

కొత్త నిబంధనలు ఇవి..

* ఒక నెల‌లో బ్యాంక్ బ్రాంచ్‌లు, ఏటీఎమ్‌ల వ‌ద్ద మొత్తం నాలుగు ఉచిత న‌గ‌దు లావాదేవీలు నిర్వ‌హించుకోవ‌చ్చు. ఆ తర్వాత ఒక్కో లావాదేవీకి రూ.15+జీఎస్‌టీ వ‌సూలు చేస్తారు.

* ఒక ఆర్థిక సంవ‌త్స‌రంలో బీఎస్‌బీడి ఖాతాదారుల‌కు 10 చెక్ లీవ్స్‌ ఉచితంగా లభిస్తాయి. ఆ త‌రువాత అందించే చెక్కుల‌కు ఛార్జి వ‌సూలు చేస్తుంది. 10 లీవ్స్‌తో ఉన్న చెక్‌బుక్‌కి రూ.40+జీఎస్‌టీ, 25 లీవ్స్‌తో ఉన్న చెక్‌బుక్‌కి రూ.75+జీఎస్‌టీ కట్టాల్సి ఉంటుంది. ఈ కొత్త చెక్‌బుక్ స‌ర్వీస్ ఛార్జీల నుంచి సీనియ‌ర్ సిటిజ‌న్లను మిన‌హాయించారు.

* అత్యవసరంగా చెక్ బుక్ పొందాలనుకుంటే రూ.50తోపాటు అదనంగా జీఎస్టీ కట్టాలి.


Next Story