స‌రిగ్గా అదే రోజున మ‌ళ్లీ భారత్ బంద్‌కు పిలుపు

Samyukt Kisan Morcha calls for Bharat Bandh on September 25. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు నూత‌న‌ వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా

By Medi Samrat  Published on  27 Aug 2021 3:36 PM GMT
స‌రిగ్గా అదే రోజున మ‌ళ్లీ భారత్ బంద్‌కు పిలుపు

కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు నూత‌న‌ వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న‌ రైతు సంఘాలు త‌మ పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేయాలని నిర్ణయించాయి. ఈ మేరకు సంయుక్త్‌ కిసాన్‌ మోర్చా ఆధ్వ‌ర్యంలో రైతు సంఘాలు సెప్టెంబర్‌ 25న భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి. శుక్ర‌వారం ఢిల్లీలోని సింఘు సరిహద్దు వద్ద రైతు సంఘాల నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆల్‌ ఇండియా కిసాన్‌ మజ్దూర్‌ సభ నేత ఆశీష్ మిట్ట‌ల్‌ మాట్లాడుతూ.. గతేడాది కూడా కరోనా ఉద్ధృతంగా ఉన్న సమయంలో సెప్టెంబ‌ర్ 25న‌ భారత్‌ బంద్‌ నిర్వహించామని గుర్తు చేశారు.

ఇక‌ ఈ ఏడాది పిలుపునిచ్చిన భారత్‌ బంద్‌ మరింత విజయవంతం అవుతుందని భావిస్తున్నట్టు ఆశీష్ మిట్ట‌ల్‌ తెలిపారు. కార్పొరేట్‌ సంస్థలకు అనుకూలంగా ఉన్న ఈ మూడు వ్యవసాయ చట్టాలను కేంద్రం ఉపసంహరించుకోవాలని ఆయ‌న‌ డిమాండ్‌ చేశారు. ఈ పోరాటంలో భాగంగా రైతులు ఢిల్లీ సరిహద్దుల్లోకి వచ్చి తొమ్మిది నెలలు పూర్తయిందన్నారు. ఇదిలావుంటే.. నూత‌న వ్య‌వ‌సాయ‌ చట్టాలపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పది సార్లు రైతు సంఘాల నేతలతో చర్చలు జరపగా విఫలమయ్యాయి.


Next Story