కేరళలో ఆదిత్యనాథ్ పర్యటన సమయంలో నిరసన.. ఆ తర్వాత ఆర్‌ఎస్‌ఎస్, ఎస్‌డీపీఐ మధ్య ఘర్షణ

RSS worker stabbed to death in Kerala during SDPI rally. కేరళ రాష్ట్రంలోని అలప్పుజ జిల్లాలో బుధవారం రాత్రి రాష్ట్రీయ

By Medi Samrat  Published on  25 Feb 2021 1:37 PM GMT
కేరళలో ఆదిత్యనాథ్ పర్యటన సమయంలో నిరసన.. ఆ తర్వాత ఆర్‌ఎస్‌ఎస్, ఎస్‌డీపీఐ మధ్య ఘర్షణ

కేరళ రాష్ట్రంలోని అలప్పుజ జిల్లాలో బుధవారం రాత్రి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్‌ఎస్‌ఎస్‌)‌, స్థానిక సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఆర్గనైజేషన్‌ (ఎస్‌డీపీఐ) మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన ఓ కార్యకర్త మృతి చెందాడని పోలీసులు తెలిపారు. ఈ గొడవల్లో ఇరు వర్గాలకు చెందిన పలువురు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు.

అలప్పుజ జిల్లాలోని వయలార్ పట్టణంలో ఆర్‌ఎస్‌ఎస్‌, ఎస్‌డీపీఐ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన నందు అనే కార్యకర్త మృతి చెందాడు. ఇరు వర్గాలకు చెందిన ఆరుగురికి తీవ్ర గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా పార్టీకి చెందిన ఎస్‌డీపీఐ ఆర్గనైజేషన్‌ విరాళలు సేకరిస్తున్న సమయంలో ఈ ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆరుగురు ఎస్‌డీపీఐ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు.

ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త మృతి చెందడాన్ని నిరసిస్తూ అలప్పుజ జిల్లాలో గురువారం ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు బీజేపీ, పలు హిందూ సంఘాలు బంద్‌కు పిలుపునిచ్చాయి. కాజర్‌గోడ్ నుంచి తిరువనంతపురం వరకు బీజేపీ చేపట్టిన విజయ యాత్ర ప్రారంభోత్సవానికి వచ్చిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పర్యటనపై ఎస్‌డీపీఐ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే గురువారం ఇరు వర్గాల మధ్య ఘర్షణ ఉద్రిక్తంగా మారింది.


Next Story