వాహనదారులకు బిగ్ షాక్.. పెరిగిన‌ ప్రీమియం పెట్రోల్ ధరలు

హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పిసిఎల్) తన ప్రీమియం పెట్రోల్ ధరను లీటరుకు రూ. 2 పెంచింది.

By -  Medi Samrat
Published on : 20 March 2026 4:02 PM IST

వాహనదారులకు బిగ్ షాక్.. పెరిగిన‌ ప్రీమియం పెట్రోల్ ధరలు

హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పిసిఎల్) తన ప్రీమియం పెట్రోల్ ధరను లీటరుకు రూ. 2 పెంచింది. ఈ సవరించిన ధరలు శుక్రవారం నుంచే అమల్లోకి వచ్చాయి. ఈ పెంపు వెనుక గల కారణాన్నిహెచ్‌పిసిఎల్ వెల్లడించనప్పటికీ, ప్రపంచ ముడి చమురు ధరలలో హెచ్చుతగ్గులు, కొనసాగుతున్న ఇరాన్-అమెరికా వివాదం నేపథ్యంలో రవాణా ఖర్చులలో మార్పులే ఈ నిర్ణయానికి దారితీసి ఉండవచ్చని భావిస్తున్నారు.

అయితే, హెచ్‌పిసిఎల్ సాధారణ పెట్రోల్ ధరలో ఎలాంటి మార్పు లేదు. అంతకుముందు, హెచ్‌పిసిఎల్ 'X'లో ఒక పోస్ట్‌లో "ముడి చమురు సరఫరాలో ఎలాంటి అంతరాయం లేదు. అదనపు కార్గోలు ఇప్పటికే మార్గంలో ఉన్నాయి. రాబోయే రోజుల్లో భారత్‌ సరఫరా స్థితిని మరింత బలోపేతం చేస్తాయి" అని పేర్కొంది. "వదంతులను నమ్మవద్దు. అధికారిక అప్‌డేట్‌లను విశ్వసించండి" అని పేర్కొంది.

హోర్ముజ్ జలసంధి గుండా నౌకలకు సురక్షిత మార్గాన్ని కల్పించేందుకు ప్రముఖ ఐరోపా దేశాలు, జపాన్ కలిసికట్టుగా కృషి చేస్తామని ముందుకు రావడంతో ఈ రోజు ప్రారంభంలో ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 105 డాలర్లకు పడిపోయాయి. చమురు సరఫరాను పెంచేందుకు అమెరికా కూడా చర్యలను వివరించింది. పలు గల్ఫ్ దేశాల్లోని ఇంధన మౌలిక సదుపాయాలపై ఇరాన్ జరిపిన దాడుల కారణంగా చమురు ధర 110 డాలర్ల మార్కును దాటిన నేపథ్యంలో ఈ ప్రయత్నాలు జరిగాయి.

భారతదేశం తన ఇంధన అవసరాల కోసం ఎగుమతులపై ఎక్కువగా ఆధారపడటం వలన ఇది మరింత ముఖ్యమైన విషయం. గ్లోబల్ పెట్రోల్ ప్రైసెస్ నుండి సంకలనం చేసిన డేటా ప్రకారం, ఫిబ్రవరి 23 నుండి మార్చి 11 మధ్య కనీసం 95 దేశాలలో పెట్రోల్ ధరలు పెరిగాయి. ఇరాన్‌లో తాజా ఘర్షణ ఫిబ్రవరి 28న ప్రారంభమైంది.

Next Story