తన పిల్లలను కాపాడుకునేందుకు.. వీధి కుక్కలతో పోరాడిన మహిళా గర్భిణీ.. ఇద్దరి పరిస్థితి విషమం

Pregnant woman fights stray dogs to save her 3 kids in UP. సీమ అనే మహిళ గర్బిణీ వంట చేస్తుండగా ఆరుబయట ఆడుకుంటున్న తన ముగ్గురు పిల్లల అరుపులు ఆమెకు వినిపించాయి.

By అంజి  Published on  22 Dec 2021 6:56 AM GMT
తన పిల్లలను కాపాడుకునేందుకు.. వీధి కుక్కలతో పోరాడిన మహిళా గర్భిణీ.. ఇద్దరి పరిస్థితి విషమం

సీమ అనే మహిళ గర్బిణీ వంట చేస్తుండగా ఆరుబయట ఆడుకుంటున్న తన ముగ్గురు పిల్లల అరుపులు ఆమెకు వినిపించాయి. ఆమె వెంటనే బయటకు పరుగెత్తుకుంటూ వెళ్లింది. అక్కడ ఆరు కుక్కల గుంపు తన కుమార్తె పల్లవి (5)ని ఈడ్చుకెళ్తుండగా, రెండు కుక్కలు తన కుమారులు అనూజ్(10), మోను (3)లను దాడి చేస్తున్నాయి. సీమ ఒంటరిగా వీధికుక్కల గుంపుతో పోరాడింది. మహిళా గర్భిణీ వాటిని వెళ్లగొట్టేందుకు ఎంతగానో ప్రయత్నించింది. ముగ్గురు పిల్లలకు గాయాలు కాగా, గర్భిణీ సీమ, కుమార్తె పల్లవి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన సుంగడి పోలీస్ సర్కిల్ పరిధిలోని పిలిభిత్ నగర శివార్లలోని బర్హా గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది.

కుక్కలు పల్లవి తల, చేతుల నుండి మాంసాన్ని చీల్చాయి. సీమను కూడా కుక్కలు తీవ్రంగా కరిచాయి. సీమాతో పాటు ముగ్గురు పిల్లలను కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తీసుకెళ్లారు. అక్కడ నుండి తల్లి, కుమార్తెను జిల్లా ఆసుపత్రికి రెఫర్ చేశారు. పల్లవి తీవ్రగాయాలతో బాధపడుతోందని, ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటన జరిగినప్పుడు ఆమె భర్త దన్వీర్ సింగ్ అనే రైతు కూలీ నిమిత్తం బయటకు వెళ్లాడు.

సుంగడి పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ శ్రీకాంత్ ద్వివేది మాట్లాడుతూ.. "దాడి గురించి సమాచారం అందుకున్న మేము గ్రామానికి వెళ్ళాము. వీధి కుక్కల వల్ల కుటుంబం గాయపడినందున, ఈ కేసులో ఎటువంటి ఫిర్యాదు సాధ్యం కాదు. మునిసిపల్ కార్పొరేషన్ నుండి ఒక బృందం గ్రామానికి వెళ్లి ఆ ప్రాంతంలో వీధి కుక్కలను పట్టుకోవడానికి డ్రైవ్ నిర్వహిస్తామని స్థానికులకు హామీ ఇచ్చారు.

Next Story