ఒడిశా తీరంలో 'ప్ర‌ళ‌య్' క్షిప‌ణి పరీక్ష విజ‌య‌వంతం..!

Pralay missile successfully test-fired. భారత్‌ బుధవారం నాడు ఉపరితలం నుండి ఉపరితలానికి గైడెడ్, స్వల్ప-శ్రేణి ప్రళయ్‌ బాలిస్టిక్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది.

By అంజి  Published on  22 Dec 2021 8:35 AM GMT
ఒడిశా తీరంలో ప్ర‌ళ‌య్ క్షిప‌ణి పరీక్ష విజ‌య‌వంతం..!

భారత్‌ బుధవారం నాడు ఉపరితలం నుండి ఉపరితలానికి గైడెడ్, స్వల్ప-శ్రేణి ప్రళయ్‌ బాలిస్టిక్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. ఈ క్షిపణి తన లక్ష్యాలను విజయవంతంగా పూర్తి చేసిందని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ తెలిపింది. 150 నుంచి 500 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించగల ఈ క్షిపణిని ఒడిశా తీరంలో ఉద‌యం 10.30 గంట‌ల‌కు ఏపీజే అబ్దుల్ క‌లాం ఐలాండ్ నుంచి ఈ క్షిప‌ణిని ప‌రీక్షించారు. ఇది అధిక స్థాయి ఖచ్చితత్వంతో నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకుంది, నియంత్రణ, మార్గదర్శకత్వం, మిషన్ అల్గారిథమ్‌లను ధృవీకరిస్తుంది. అని డీఆర్‌డీవో అధికారు తెలిపారు.

500 కిలోల నుండి 1000 కిలోల బరువును మోసుకెళ్లగల ఈ క్షిపణిని.. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించారు. ప్రయోగ సమయంలో అన్ని ఉప-వ్యవస్థలు 'సంతృప్తికరంగా' పనిచేశాయని అధికారులు తెలియజేశారు. అన్ని సెన్సార్లు తూర్పు తీరంలోని ఇంపాక్ట్ పాయింట్ దగ్గర మోహరించబడ్డాయి. వీటిలో డౌన్‌రేంజ్ షిప్‌లు, క్షిపణి పథాన్ని ట్రాక్ చేయడం, అన్ని సంఘటనలను సంగ్రహించడం వంటివి ఉన్నాయి. ప్రళయ్‌ సాలిడ్ ప్రొపెల్లెంట్ రాకెట్ మోటారుతో ఆధారితమైనది. అనేక కొత్త సాంకేతికతలను కలిగి ఉంది. ట్రయల్‌ని విజయవంతం చేసినందుకు డీఆర్‌డీవో, అనుబంధ బృందాలను అభినందించినట్లు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు.

డిఆర్‌డిఓ చైర్మన్ డాక్టర్ జి సతీష్ రెడ్డిని మాట్లాడుతూ.. ఇండక్షన్ తర్వాత ఆధునిక సాంకేతికతతో కూడిన ఈ క్షిపణి 'సాయుధ దళాలకు అవసరమైన ఇన్‌పుట్‌లను అందిస్తుంది' అని అన్నారు. మొబైల్ లాంచర్ నుండి ప్రళయ్‌ను ప్రయోగించవచ్చని, దీనిలో అత్యాధునిక నావిగేషన్ సిస్టమ్, ఇంటిగ్రేటెడ్ ఏవియానిక్స్ ఉన్నాయి పేర్కొన్నారు. ఈ క్షిపణిని అభివృద్ధి చేసే ప్రాజెక్ట్ దాదాపు ₹333 కోట్ల బడ్జెట్‌తో మార్చి 2015లో మంజూరు చేయబడింది. ఈ ఆయుధం ఇండియన్ బాలిస్టిక్ మిస్సైల్ డిఫెన్స్ ప్రోగ్రామ్ నుండి పృథ్వీ డిఫెన్స్ వెహికల్ ఆధారంగా రూపొందించబడింది.


Next Story