గుజరాత్లోని జామ్నగర్లో అక్రమంగా నిర్మించిన మతపరమైన స్థలాన్ని కూల్చేశారు. అయితే ఇందులో ఈత కొలను, బాత్టబ్, భారీ, విశాలమైన గదులు కూడా ఉన్నాయి. అక్రమంగా నిర్మించిన మతపరమైన స్థలంలో వీటిని కనుగొన్నారు. నాలుగు మతపరమైన ప్రదేశాలు సహా 294 ఇళ్లను అక్రమంగా నిర్మించడంపై పౌర అధికారుల యాక్షన్ లోకి దిగారు. బచు నగర్ ఎక్స్టెన్షన్లోని ప్రార్థనా స్థలంలో విలాసవంతమైన సౌకర్యాలు కనిపించాయని సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఈ ఇళ్ల యజమానులు సుమారు 20-25 సంవత్సరాల క్రితం ఈ నిర్మాణాలను చేపట్టారు. అప్పటి నుండి ఇక్కడే నివసిస్తున్నారు. ఈ ఇళ్లలో కొన్నింటి కారణంగా గణనీయమైన పర్యావరణ నష్టం ఏర్పడింది.ఆ ప్రాంతంలో ప్రవహించే రంగమతి నది ప్రవాహాన్ని అడ్డుకున్నాయి ఇక్కడి కట్టడాలు.
ఆ ప్రదేశంలో నాలుగు మతపరమైన ప్రదేశాలు అక్రమంగా నిర్మించారు. అవి 11,000 చదరపు అడుగులకు పైగా విస్తరించి ఉన్నాయి. ఒక మతపరమైన ప్రాంతం లోపల విలాసవంతమైన సౌకర్యాలను చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు. పోలీసుల నిఘాలో కూల్చివేతలు జరిగిన భూమి ధర సుమారు రూ. 200 కోట్లు అని తెలుస్తోంది.