పెళ్లిలో ఆహారం కలుషితం.. అస్వస్థత గురై ఆస్పత్రిలో చేరిన 1200 మంది

Over 1,200 hospitalised after consuming food at wedding in Mehsana. ఓ పెళ్లి వేడుకలో అపశ్రుతి చోటు చేసుకుంది. పెళ్లి విందు ఆరగించిన 1200 మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన గుజరాత్‌

By అంజి  Published on  6 March 2022 3:32 AM GMT
పెళ్లిలో ఆహారం కలుషితం.. అస్వస్థత గురై ఆస్పత్రిలో చేరిన 1200 మంది

ఓ పెళ్లి వేడుకలో అపశ్రుతి చోటు చేసుకుంది. పెళ్లి విందు ఆరగించిన 1200 మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన గుజరాత్‌ రాష్ట్రంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. మెహసానా జిల్లాలో స్థానిక కాంగ్రెస్ నాయకుడి కుమారుడి వివాహ వేడుకలో ఆహారం తిన్న 1,200 మందికి పైగా ప్రజలు అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలయ్యారని పోలీసులు శనివారం తెలిపారు. విస్‌నగర్ తాలూకాలోని సవాలా గ్రామంలో శుక్రవారం అర్థరాత్రి ఈ సంఘటన జరిగిందని విస్‌నగర్ రూరల్ పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు. పెళ్లిలో భోజనం చేసిన 1,200 మందికి పైగా ప్రజలు అస్వస్థతకు గురయ్యారని, ఆసుపత్రి పాలయ్యారని మెహసానా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పార్థరాజ్‌సింగ్ గోహిల్ తెలిపారు.

ప్రజలు వాంతులు చేసుకోవడం, విరేచనాలు కావడం ప్రారంభించారని, దీంతో వారిని విస్‌నగర్, మెహసానా, వాద్‌నగర్‌లోని వివిధ ఆసుపత్రులకు తరలించినట్లు ఆయన తెలిపారు. తదుపరి పరీక్షల కోసం ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ, ఫుడ్ అండ్ డ్రగ్ డిపార్ట్‌మెంట్ వారు ఫంక్షన్‌లో వడ్డించిన ఆహారం యొక్క నమూనాలను సేకరించినట్లు ఆయన తెలిపారు. విస్‌నగర్ రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సవాలా గ్రామంలో జరిగిన స్థానిక కాంగ్రెస్ నాయకుడి కుమారుడి వివాహ కార్యక్రమానికి పలువురు హాజరయ్యారు. మాంసాహారం కూడా మెనూలో భాగం. తదుపరి విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.

Next Story