పాత నాణేలను వేలంపాట వేస్తూ ఉంటే భారీ ధరకు అమ్ముడు పోతూ ఉంటాయి. అలాంటి వార్తలు మనం చాలానే విన్నాం. తాజాగా భారత రూపాయి నాణెం ఏకంగా 10 కోట్లకు అమ్ముడుపోయింది. ప్రజలు పాత నోట్లు మరియు నాణేలను సేకరించి, సరైన ప్లాట్ఫామ్లో విక్రయించడం ద్వారా పెద్ద ఎత్తున డబ్బులు ఆర్జిస్తూ ఉంటారు. ఇటీవల ఒక రూపాయి నాణెం వేలంలో విక్రయించబడింది. అయితే దానికి రూ. 10 కోట్లు వచ్చింది. ఇది ఆశ్చర్యకరంగా ఉన్నా.. కానీ అదే నిజం.1885 లో భారతదేశంలో బ్రిటిష్ రాజులా సమయంలో జారీ చేయబడింది ఈ నాణెం. కొందరు వ్యక్తులు అనేక వెబ్సైట్లలో ప్రొఫైల్లను సృష్టించి. అక్కడ వారు తమ నాణేలను విక్రయించవచ్చు.
ఈ వెబ్సైట్లలో ఒకటి CoinBazar, ఇక్కడ వినియోగదారులు పేరు, చిరునామా, ఇమెయిల్, ఫోన్ నంబర్ మరియు మరిన్ని వంటి ప్రాథమిక వివరాలను నమోదు చేసుకోవచ్చు మరియు ఇవ్వవచ్చు. జాబితాను నమోదు చేసిన తర్వాత, కొనుగోలుదారులు సంప్రదిస్తారు. వారు అడిగిన మొత్తాన్ని బేరమాడవచ్చు. ఓ వ్యక్తి దగ్గర ఇది ఉండగా ఇటీవల జరిగిన వేలంపాటలో ఓ వెబ్సైట్ దీనిని ఏకంగా రూ. 10 కోట్లకు కొనుగోలు చేశారు. ఒక్క నాణేం అతన్ని మిలియనీర్ చేసింది. గత జూన్లో కూడా 1933 నాటి యూఎస్ నాణేం న్యూయార్క్లో జరిగిన వేలంలో 18.9 మిలియన్లు( దాదాపు 188 కోట్లు) అమ్ముడుపోయింది.