అలకనందా నదిలో పడిన బస్సు.. 11 మంది గల్లంతు

ఉత్తరాఖండ్‌లో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. ప్రయాణికులతో వెళ్తున్న‌ బస్సు అలకనందా నదిలో కొట్టుకుపోయింది.

By Medi Samrat
Published on : 26 Jun 2025 10:48 AM IST

అలకనందా నదిలో పడిన బస్సు.. 11 మంది గల్లంతు

ఉత్తరాఖండ్‌లో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. ప్రయాణికులతో వెళ్తున్న‌ బస్సు అలకనందా నదిలో కొట్టుకుపోయింది. ఈ ఘ‌ట‌న‌లో 11 మందికి పైగా ప్రయాణికులు గల్లంతయ్యారు. చాలా మంది చనిపోయి ఉంటార‌ని తోటి ప్ర‌యాణికులు భయపడుతున్నారు. ఈ ఘటన ఘోల్తీర్‌లో చోటుచేసుకుంది.

రుద్రప్రయాగ్ జిల్లాలోని ఘోల్తీర్ ప్రాంతంలో బస్సు అదుపు తప్పి అలకనంద నదిలో పడిపోయిందని పోలీసు ప్రధాన కార్యాలయ అధికార ప్రతినిధి ఐజీ నీలేష్ ఆనంద్ భర్నే ఏఎన్‌ఐకి తెలిపారు. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం బస్సులో 19 మంది ఉన్నారు.

బస్సు టెంపో ట్రావెలర్లకు చెందినదని చెబుతున్నారు. యాత్రికులందరూ బద్రీనాథ్‌ను సందర్శించేందుకు వెళ్తున్నారు. బస్సులో మొత్తం 19 మంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం. ఇందులో ఏడుగురిని బయటకు తీశారు. గాయపడిన ఆరుగురు ప్రయాణికులను రక్షించి జిల్లా ఆసుపత్రికి తరలిస్తున్నారు. ఒకరు మృతి చెందారు. ఈ ఘటన ఉదయం 7.40 గంటల ప్రాంతంలో జరిగింది. మిగిలిన‌వారి కోసం అన్వేష‌ణ కొన‌సాగుతుంది.

Next Story