అయోధ్య దీపోత్స‌వంలో పాల్గొన్న‌ ప్రధాని మోదీ

On Chhoti Diwali, PM Modi performs symbolic rajyabhishek of Lord Ram in Ayodhya. ఆదివారం ఛోటీ దీపావళి సందర్భంగా ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ

By Medi Samrat  Published on  23 Oct 2022 3:30 PM GMT
అయోధ్య దీపోత్స‌వంలో పాల్గొన్న‌ ప్రధాని మోదీ

ఆదివారం ఛోటీ దీపావళి సందర్భంగా ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శ్రీరాముడికి రాజ్యభిషేకం నిర్వహించారు. అయోధ్య డీఎన్‌ఏలో రాముడు ఉన్నాడని ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం అన్నారు. రామ్‌లల్లాను సందర్శించి ప్రార్థనలు చేయడం తనకు గౌరవం, ఆశీర్వాదం అని ప్రధాని అన్నారు. దీపావళి సందర్భంగా ఆయన రామభక్తులకు శుభాకాంక్షలు తెలిపారు.

"నిషాద్రాజ్ పార్క్ శృంగ్వేర్పూర్ ధామ్ (ప్రయాగ్రాజ్)లో స్థాపించబడింది. రాముడు, నిషాదరాజుల విగ్రహాన్ని 51 అడుగుల ఎత్తులో నిర్మిస్తామని.. రాముడి ఆదర్శాలను అనుసరించడం భారతీయులందరి కర్తవ్యమని మోదీ అన్నారు. దీపోత్సవ్ ఆరవ ఎడిషన్‌ను పురస్కరించుకుని ప్రధాని ఆదివారం అయోధ్యకు చేరుకున్నారు. ఇందులో భాగంగా 15 లక్షల దీపాలను వెలిగిస్తున్నారు. సరయూ నది ఒడ్డున 'ఆరతి' కూడా అర్పించారు. పర్యటనలో భాగంగా అయోధ్యలోని శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర స్థలాన్ని కూడా ఆయన పరిశీలించారు.



Next Story