బాంబు పేలుడులో జర్నలిస్ట్ మృతి.. మావోయిస్టులపై పోలీసుల అనుమానం

Odisha Journalist Killed In Bomb Blast. ఒడిశాలోని కలహండి జిల్లాలో శనివారం మావోయిస్టులు భద్రతా సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్ పేలుడులో ఒ

By అంజి  Published on  6 Feb 2022 6:19 AM GMT
బాంబు పేలుడులో జర్నలిస్ట్ మృతి.. మావోయిస్టులపై పోలీసుల అనుమానం

ఒడిశాలోని కలహండి జిల్లాలో శనివారం మావోయిస్టులు భద్రతా సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్ పేలుడులో ఒక జర్నలిస్టు మరణించినట్లు పోలీసు అధికారి తెలిపారు. ఒడియా దినపత్రికకు చెందిన 43 ఏళ్ల జర్నలిస్ట్ శనివారం మధ్యాహ్నం వచ్చే పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేయవద్దని హెచ్చరిస్తున్న మావోయిస్టులు వేసిన పోస్టర్ల దగ్గరకు వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా పేలుడులో మరణించారు. ఈ విషయాన్ని మదన్‌పూర్-రాంపూర్ బ్లాక్‌లోని మోహనగిరి గ్రామం పోలీసులు తెలిపారు.

కలహండి జిల్లాలోని ప్రముఖ ఒడియా దినపత్రిక ధరిత్రి రిపోర్టర్ రోహిత్ బిస్వాల్, కర్లర్‌కుంట వంతెన సమీపంలో పంచాయతీ ఎన్నికల బహిష్కరణకు పిలుపునిస్తూ అనుమానిత మావోయిస్టులు వేసిన అనేక పోస్టర్‌ల గురించి సమాచారం అందుకున్న మదన్‌పూర్-రాంపూర్ బ్లాక్‌లోని మోహన్‌గిరి గ్రామానికి వెళ్లారు. ఒడిశాలో అక్టోబర్ 16 నుంచి 24 మధ్య పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఘటన శనివారం మధ్యాహ్నం 12 నుంచి 12.30 గంటల మధ్య ఎప్పుడైనా జరిగి ఉండవచ్చని కలహండి ఎస్పీ డాక్టర్ వివేక్ ఎం శరవణ తెలిపారు.

"ఉదయం నుండి ప్రజలను ఎన్నికలను బహిష్కరించాలని కోరుతూ మావోయిస్టుల పోస్టర్లు వేసిన ఫోటోలు మాకు అందుతున్నాయి. కొన్నిసార్లు మావోయిస్టులు అటువంటి పోస్టర్‌ల దగ్గర ఐఈడీలను ఉంచుతారు. ఆ ప్రాంతాన్ని బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్‌ల ద్వారా శుభ్రపరచకపోతే మేము సాధారణంగా అలాంటి పోస్టర్‌లను తీయడానికి తొందరపడము. విలేఖరి రోడ్డుకింద అమర్చిన ఐఈడీలపై కాలు మోపి ఉండవచ్చు లేదా పేలుడుకు కారణమైన పోస్టర్‌లకు చాలా దగ్గరగా వెళ్లి ఉండవచ్చని నేను అనుమానిస్తున్నాను. ఇది ఎలా జరిగిందనే దానిపై మాకు ఇంకా స్పష్టత రాలేదు, "అని అధికారి చెప్పాడు.

సీఆర్పీఎఫ్‌, పోలీసుల సంయుక్త బృందం దర్యాప్తు ప్రారంభించిందని వర్గాలు తెలిపాయి. జర్నలిస్టుకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.జర్నలిస్ట్‌ కుటుంబానికి ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ రూ. 13 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. ఒడిశా పోలీసులు రూ. 9 లక్షలు అందించగా, మిగిలిన రూ. 4 లక్షలు జర్నలిస్టు సంక్షేమ నిధి నుంచి అందజేస్తామని రాష్ట్ర ప్రభుత్వ మీడియా సలహాదారు మానస్‌ మంగరాజ్‌ తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌లోని దంతేవాడ జిల్లా అరన్‌పూర్ సెక్టార్‌లో అక్టోబర్ 2018లో జరిగిన ఐఈడీ పేలుడులో ఒడిశాకు చెందిన దూరదర్శన్ జర్నలిస్ట్ అచ్యుత్యానంద సాహు, ఇద్దరు పోలీసు సిబ్బంది మరణించారు.

Next Story