గత ఏడేళ్లలో 117 శాతం భారత్‌ అప్పులు పెరిగాయి.. ఇప్పుడు మన దేశం అప్పు ఎంతంటే.?

Now how much is our country in debt?. ఇప్పుడు మన దేశం అప్పు ఎంతో తెలిస్తే.. నోరెళ్ల బెడతారు. ఎందుకంటే సంక్షేమం పేరిట కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లక్షల కోట్లు అప్పులు చేశారు.

By అంజి  Published on  12 Dec 2021 3:19 AM GMT
గత ఏడేళ్లలో 117 శాతం భారత్‌ అప్పులు పెరిగాయి.. ఇప్పుడు మన దేశం అప్పు ఎంతంటే.?

ఇప్పుడు మన దేశం అప్పు ఎంతో తెలిస్తే.. నోరెళ్ల బెడతారు. ఎందుకంటే సంక్షేమం పేరిట కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లక్షల కోట్లు అప్పులు చేశారు. గత 70 ఏళ్లలో భారతదేశ అప్పు ఏకంగా 5.29 లక్షల శాతం పెరిగింది. 1950-51 సంవత్సరంలో భారత్ నికర అప్పుడు రూ.2,565.40 కోట్లుగా ఉంది. అయితే నేటికి అంటే 2021 - 22 వరకు అప్పు రూ.1,35,86,975.52 కోట్లకు చేరింది. సమాచార హక్కు చట్టం కింద సామాజిక కార్యకర్త ఇనగంటి రవి కుమార్‌ అడిగిన ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. 2014-15 సంవత్సరం నాటికి భారత్‌ నికర అప్పు రూ.62,42,220.92 కోట్లు ఉంది. అయితే అది గడిచిన ఏడు సంవత్సరాల్లో 117 శాతం పెరిగింది.

అంటే 2021 -22 బడ్జెట్‌ నాటికి అక్షరాల రూ.1,35,86,975.52 కోట్లకు పెరిగింది. 2014-15కు ముందు దేశం అప్పు రూ.62.42 లక్షల కోట్ల మేర ఉంది. కాగా కొత్తగా గత ఏడు సంవత్సరాల్లో రూ.73,44,754 కోట్ల అప్పులు చేసినట్లు సమాచార హక్కు చట్టం ద్వారా తెలిసింది. 1950-51లో విదేశీ రుణం రూ.32.03 కోట్లు, దేశ అంతర్గత అప్పు రూ.2,022.30 కోట్లు ఉంది. అది 2021 -22 నాటికి విదేశీ అప్పు రూ.4,27,925.24 కోట్లు, దేశ అంతర్గత అప్పు రూ.1,13,57,415 కోట్లకు పెరిగింది. 70 ఏళ్ల కిందట చమురు మార్కెటింగ్‌ కంపెనీలు, ఎరువుల కంపెనీలు, ఎఫ్‌సీఐకి రాయితీ కింద చెల్లించాల్సిన అప్పులు లేవు. కానీ ఇప్పుడు ఆ రాయితీల భారం రూ.1,62,827.90 కోట్లకు పెరిగింది.

Next Story