ఈడీ, సీబీఐ పనుల్లో నేను జోక్యం చేసుకోను: ప్రధాని మోదీ

తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2014 తర్వాత ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సామర్థ్యం మెరుగుపడిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.

By అంజి  Published on  21 April 2024 3:04 AM GMT
ED, CBI, PM Modi, National news

ఈడీ, సీబీఐ పనుల్లో నేను జోక్యం చేసుకోను: ప్రధాని మోదీ

తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2014 తర్వాత ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సామర్థ్యం మెరుగుపడిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అందుకు రుజువుగా గణాంకాలను అందించామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. 2014కి ముందు మనీలాండరింగ్ నిరోధక చట్టం (పిఎంఎల్‌ఎ) కింద ఇడి 1,800 కంటే తక్కువ కేసులను నమోదు చేసిందని ప్రధాని మోదీ చెప్పారు. ఎన్‌డిఎ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి సంఖ్య 5,000 కంటే ఎక్కువ పెరిగిందని ప్రధాని మోదీ చెప్పారు.

ఇది వారి మెరుగైన సామర్థ్యానికి నిదర్శనం అని ఆసియానెట్ న్యూస్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని అన్నారు. 2014కి ముందు, తర్వాత నిర్వహించిన సోదాల సంఖ్య 84 నుంచి 7,000కు పెరిగిందని ఆయన తెలిపారు. తమను లక్ష్యంగా చేసుకోవడానికి కేంద్ర ఏజెన్సీలను ఉపయోగించుకుంటున్నారని ప్రతిపక్షాలు లేవనెత్తిన ఆరోపణలను కూడా ప్రధాని మోదీ ప్రస్తావించారు. ఈడీ నమోదు చేసిన అవినీతి కేసుల్లో కేవలం మూడు శాతం మాత్రమే రాజకీయాలకు సంబంధించిన వ్యక్తులపైనే ఉన్నాయన్నారు.

ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న విమర్శలపై కూడా ఆయన ఘాటుగా స్పందించారు. అవినీతికి వ్యతిరేకంగా చర్యలు తీసుకోవడానికి ఒక సంస్థను స్థాపించినట్లయితే, అది తన పనిని చేయకపోతే ప్రశ్నలు అడగాలి. అది తన పని చేస్తుంది కాబట్టి ప్రశ్నలు అడగడం సమంజసం కాదు అని అన్నారు. దర్యాప్తు సంస్థలను స్వతంత్రంగా పనిచేసేలా అనుమతించాలని, వారి రాజకీయ ప్రయోజనాల కోసం వారి పనికి ఆటంకం కలిగించవద్దని ప్రధాని అన్నారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) తమ పనులు చేస్తున్నాయని, వాటిని ఎవరూ అడ్డుకోవద్దని ప్రధాని నరేంద్ర మోదీ శనివారం పునరుద్ఘాటించారు. ప్రధానమంత్రిగా ఉన్నప్పటికీ, ఏజెన్సీల పనుల్లో తాను జోక్యం చేసుకోలేనని అన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికలు “క్లిష్టమైనవి”, ఎందుకంటే “మూడు దశాబ్దాల అస్థిర ప్రభుత్వాల” తర్వాత “స్థిరమైన ప్రభుత్వం ఏమి చేయగలదో దేశంలోని ఓటర్లు అనుభవించారు” అని ప్రధాని మోదీ అన్నారు.

ఇలాంటి "అస్థిర ప్రభుత్వాలు" దేశానికి చాలా నష్టం చేశాయని, ప్రజలు తమ అనుభవం ఆధారంగా ఓట్లు వేస్తారని, ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు ముఖ్యమైనవని ప్రధాని అన్నారు. 2024 ఎన్నికలను బీజేపీ లేదా మోదీ ఎదుర్కోవడం లేదని నేను నమ్ముతున్నాను, ఇది ప్రజల చొరవ అని ప్రధాని అన్నారు. 2014లో తాను ప్రధాని కావడంపై కూడా ఆయన మాట్లాడుతూ, ‘ప్రజలు నాపై ఆశలు పెట్టుకున్నారు, దేశ ప్రజల ఆశలను నెరవేర్చాలనే ఆశలు నాకు ఉన్నాయి. నేను పాలించను, సేవ చేస్తాను. నాకు ప్రభుత్వాన్ని నడపడం అంటే ప్రభుత్వాన్ని నడుపుతూ నా పదవిని ఆస్వాదించడం కాదు" అని అన్నారు.

Next Story