ప్రధాని మోదీ తల్లిపై అనుచిత వ్యాఖ్యలు.. 4న బంద్కు పిలుపునిచ్చిన బీజేపీ
బీహార్లో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై, ఆయన దివంగత తల్లిపై చేసిన వ్యాఖ్యలపై సెప్టెంబర్ 4న బీహార్లో ఎన్డిఎ బంద్ పాటించనుంది
By Medi Samrat
బీహార్లో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై, ఆయన దివంగత తల్లిపై చేసిన వ్యాఖ్యలపై సెప్టెంబర్ 4న బీహార్లో ఎన్డిఎ బంద్ పాటించనుంది. బీహార్ బంద్ను బీహార్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ జైస్వాల్ ప్రకటించారు. అలాగే ఈ సమయంలో అన్ని అత్యవసర సేవలకు అంతరాయం కలగదని తెలియజేసింది. బంద్ ఉదయం 7 నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు ఉంటుందని ప్రకటించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బీహార్ స్టేట్ లైవ్లీహుడ్ ఫండ్ క్రెడిట్ కోఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ ప్రారంభోత్సవం ప్రత్యక్ష ప్రసారం సందర్భంగా.. బిజెపి రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు డా. దిలీప్ జైస్వాల్తో పాటు పలువురు మహిళా నేతలు విలపించడం ప్రారంభించారు.
రాహుల్ గాంధీ ఓటరు అధికార యాత్రలో కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు ప్రధాని మోదీపై, ఆయన దివంగత తల్లిపై అనుచిత పదజాలం ప్రయోగించడంతో బీహార్లో వివాదం చెలరేగింది. ఈ వ్యాఖ్యలపై బీజేపీ పాట్నాలోని కొత్వాలి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది.
మంగళవారం ఓటరు అధికార యాత్రలో తన తల్లిని దూషించిన పదజాలంపై ప్రధాని మోదీ మౌనం వీడారు. కొద్దిరోజుల క్రితం బీహార్లో ఏం జరిగిందో ఊహించలేదు అని అన్నారు. బీహార్లో ఆర్జేడీ-కాంగ్రెస్ వేదికపై నుంచి నా తల్లిని దుర్భాషలాడారు. ఈ దూషణలు నా తల్లిపై మాత్రమే కాదు, మొత్తం రాష్ట్రం, దేశంలోని తల్లులపై జరిగాయి. ఎందుకంటే అమ్మ అందరికీ తల్లి.. నాలో నొప్పి ఉన్నట్లే బీహారీలలో కూడా నొప్పి ఉంటుందని నాకు తెలుసు అని అన్నారు.
బీజేపీ నేత, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ జైస్వాల్ వీడియో కూడా వైరల్ అవుతోంది. ఇందులో జైస్వాల్ ఏడుస్తూ కనిపించాడు. వాస్తవానికి, బీహార్ జీవిక నిధి క్రెడిట్ కోఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ను ప్రారంభించిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించారు.
ఈ సందర్భంగా ప్రధాని మోదీ తన తల్లిని దుర్భాషలాడిన విషయాన్ని ప్రస్తావించారు. ప్రధాని మాటలు విన్న దిలీప్ జైస్వాల్ భావోద్వేగానికి గురయ్యారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.