మైసూరు హై అలర్ట్.. 72 మంది నర్సింగ్ విద్యార్థులకు కరోనా పాజిటివ్

Mysuru on High Alert as 72 nursing students test positive for Covid-19. మైసూరులో నర్సింగ్‌ కోర్సులు చదువుతున్న కేరళకు చెందిన 72 మంది విద్యార్థులకు

By Medi Samrat  Published on  1 Dec 2021 2:21 PM GMT
మైసూరు హై అలర్ట్.. 72 మంది నర్సింగ్ విద్యార్థులకు కరోనా పాజిటివ్

మైసూరులో నర్సింగ్‌ కోర్సులు చదువుతున్న కేరళకు చెందిన 72 మంది విద్యార్థులకు కోవిడ్‌-19 పాజిటివ్‌గా తేలడంతో మైసూరు జిల్లాలో హై అలర్ట్‌ ప్రకటించారు. కేసులను ముందస్తుగా గుర్తించేలా.. అలాగే వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు మైసూరులో 5,000 కోవిడ్ పరీక్షలను నిర్వహించాలని డిప్యూటీ కమిషనర్ బగాది గౌతమ్ ఆదేశించారు. కావేరీ నర్సింగ్ హాస్టల్‌లో సుమారు 43 మంది విద్యార్థులు, సెయింట్ జోసెఫ్ కాలేజీలో 29 మంది విద్యార్థులు పాజిటివ్ గా తేలడంతో ప్రజలు మరియు ఆరోగ్య అధికారులలో భయాందోళనలు మొదలయ్యాయి. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. కేరళ నుంచి మైసూరు వెళ్లే ఎంట్రీ పాయింట్ల వద్ద జిల్లా యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది.

ప్రయాణీకులకు RT-PCR పరీక్ష ప్రతికూల ఫలితాలు తప్పనిసరి చేయబడ్డాయి. కోవిడ్ రెండు వేవ్స్ సమయంలో మైసూరు తీవ్రంగా నష్టపోయింది. చాలా కాలంగా కర్ణాటక రాష్ట్రంలో అత్యధిక కేసులను నమోదు చేసింది. త్వరలోనే అంటువ్యాధులుకరోనా అదుపులోకి వస్తాయన్న విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ జిల్లా ఇన్‌ఛార్జ్‌ మంత్రి ఎస్‌.టి. సోమశేఖర్ మైసూరుతో పాటు చామరాజనగర్ జిల్లాల్లో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కర్ణాటకలో చాలా ప్రాంతాల్లో విదేశాల నుండి వచ్చిన వ్యక్తులకు వైరస్ సోకడంతో టెన్షన్స్ మొదలయ్యాయి. కొత్త Omicron వేరియంట్‌ విషయంలో నమూనాలను సేకరించి పరీక్ష కోసం పంపారు.


Next Story